ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు
కవి బ్రహ్మ తిక్కన సోమయాజి
మ: అమలో దాత్త మనీష, నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శి
స్పమునన్ బారగుఁడన్, గళావిదుఁడ ,నాపస్తంభ సూత్రుండ, గౌ
తమ గోత్రుండ , మహేశ్వరాంఘ్రి యుగళీ ధ్యానైక శీలుండ న
న్నమకున్ కొమ్మన మంత్రికిన్ సుతుఁడ సన్మాన్యుండఁ దిక్కాఖ్యుఁడన్ ;
స్పమునన్ బారగుఁడన్, గళావిదుఁడ ,నాపస్తంభ సూత్రుండ, గౌ
తమ గోత్రుండ , మహేశ్వరాంఘ్రి యుగళీ ధ్యానైక శీలుండ న
న్నమకున్ కొమ్మన మంత్రికిన్ సుతుఁడ సన్మాన్యుండఁ దిక్కాఖ్యుఁడన్ ;
అవతారిక- నిర్వచ నోత్తర రామాయణము;
కవిత్రయంలో ద్వితీయుఁడైన తిక్కన తనృకవితా రీతులను గూర్చి యిదమిథ్థముగా నెక్కడను బేర్కొనియుండలేదు. అయినను పైపద్యమును బట్టి యతని కవితారీతులను విగడించుటకు అవకాశము
లభించుచున్నది. ఇదియే గాక పలువురు వాఙ్మయ పరిశోధకులు పేర్కన్న రీతులు తిక్కన కవిత్వ పధ్ధతుల నెఱుంగుటకు వీలుఁగల్పించుచున్నవి. వీటియన్నిటి సారాంశములను దిక్ ప్రదర్శనముగా వించుటకు బ్రయత్నించెదనుగాక!
లభించుచున్నది. ఇదియే గాక పలువురు వాఙ్మయ పరిశోధకులు పేర్కన్న రీతులు తిక్కన కవిత్వ పధ్ధతుల నెఱుంగుటకు వీలుఁగల్పించుచున్నవి. వీటియన్నిటి సారాంశములను దిక్ ప్రదర్శనముగా వించుటకు బ్రయత్నించెదనుగాక!
అమలోదాత్త మనీషచే , ఉభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునందు నేర్పరియట .మనీషయనగా బుధ్ధివిశేషము. అది అమలము- స్వఛ్ఛము, ఉదాత్తము- ఉత్తమమును అయినది ; అట్టిమనీషచే నుభ య కావ్య ప్రౌఢిని బరికింపగల శిల్పమునందు పారగుఁడు - అనగాచక్కని బుధ్ధిబలముచే సంస్కృతాంధ్ర కావ్యములను నిర్మింపగల శిల్పమున నారి తేరినవాడట! కళావిదుడ- కళలస్వరూపమును దెలిసినవాడట.
ఇట బేర్కొనిన ' శిల్పము' కళ' ఈరెంటిని మిగులజాగరూకతతో బరిశీలింపవలసి యున్నది. శిల్పమనగా నైపుణ్యము. కళ యనగా నందము దానివలన గలుగునది యానందము; యేతావాతా తేలినదిది. నేను సంస్కృతాంధ్ర భాషలలో నందముగా కావ్యనులను నిర్మింప దక్షుఁడననుట! ఆవిెషయము మనకు నీక్రింది శ్లోక , పద్యములు నిరూపించు చున్నవి .
స్రగ్ధ: శ్రీ రాస్తామ్ మనమ క్షితీశ్వర భుజాదండే జగన్మండలే;
ప్రాసాద స్ధిర భార భాజి దధతాం సా సాలభంజీ శ్రియాం
శుండాలోత్తమ గండభిత్తిషు మదవ్యాసంగవస్త్యాత్మనామ్
యాముత్తేజయతేతరాం మధులిహా మానంద సాంద్ర స్థితిః;
ప్రాసాద స్ధిర భార భాజి దధతాం సా సాలభంజీ శ్రియాం
శుండాలోత్తమ గండభిత్తిషు మదవ్యాసంగవస్త్యాత్మనామ్
యాముత్తేజయతేతరాం మధులిహా మానంద సాంద్ర స్థితిః;
మనుమ సిధ్ధి భుజాస్తంభములను ప్రాసాద మునందు అలంకరణార్ధమై యుంచ బడిన సాలభంజికవలె రాజ్య లక్ష్మి స్థిర నివాసమున్నదట! మదగజముల గండస్థలముల యందలి మదజల ధారకాసపడి వచ్చి యచటనే నివాసమున్న గండుతుమ్మెద లన్నియు నుత్తేజమును గల్పింపగా రాజ్య లక్ష్మి వసించెనని తాత్పర్యము. " ఆగజాంత మైశ్వర్యం" అనునది యొక సంస్కృత సూచనము. లోకమున పెక్కు యేనుఁగు లున్నవానినే ధనవంతునిగాబరిగణించెడివారట ! మనుమ సిధ్ధి మహదైశ్వర్య వంతుఁడని యతనిగజబలమే నిరూపించు చున్నదని తాత్పర్యము. మహాబలవంతుఁడని మరోయర్ధము. అందుచేతనే యతనియింట రాజ్య రమ స్ధిర నివాసము నేర్పరచు కొనెనని ఫఎలితార్ధము. ఇది నర్వచనోత్తర రామాయణ ప్రారంభశ్లోకము; ఇదియతని సంస్కృత కవితాప్రౌఢతకు నిదర్శనము;
ఉ: శ్రీయన గౌరినాఁబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయత మూర్తియై హరిహరంబగు రూపముఁదాల్చి విష్ణురూ
పాయ! నమఃశివాయ! యని మ్రొక్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పర తత్వముఁ గొల్తు నభీష్ఠ సిధ్ధికిన్;
ద్రాయత మూర్తియై హరిహరంబగు రూపముఁదాల్చి విష్ణురూ
పాయ! నమఃశివాయ! యని మ్రొక్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పర తత్వముఁ గొల్తు నభీష్ఠ సిధ్ధికిన్;
ఇది విరాట పర్వారంభ పద్యము. అనగా తిక్కన భారతాంధ్రీకరణమున దొలిపద్య మన్నమాట; తిక్కన హరిహరనాధ భక్తుఁడు. శివకేశవాద్వైతవాది. యందుచేతనే తన బారత భాగమునకు కృతిపతియగు హరిహరనాధుని తొలిపద్యమున వర్ణిచినాడు. ఇందు శ్రీదేవికి గౌరికి యభేదము, హరికి హరునకు అభేదము చెప్పబడినది. శ్రీయనియు గూరియనియు చెప్పబడు చెలువకు హృదము పల్లవింపగా , హరి హరూపముతో
శుభంకరమైన రూపమును ధరించి " విష్ణురూపాయ నమశ్శివాయ! యని నమస్కరించు నిజభక్తగణముల వైదిక ధ్యానముల కెదమెచ్చు పరదైవతమగు హరిహరనాధుని యభీష్ఠ సిధ్ధికై సేవింతును. అని దీనియర్ధము.
శుభంకరమైన రూపమును ధరించి " విష్ణురూపాయ నమశ్శివాయ! యని నమస్కరించు నిజభక్తగణముల వైదిక ధ్యానముల కెదమెచ్చు పరదైవతమగు హరిహరనాధుని యభీష్ఠ సిధ్ధికై సేవింతును. అని దీనియర్ధము.
ఈరెండు పద్యముల బరిశీలనతో నీతని యుభయ కావ్యప్రౌడ రచనారీతి యెరుక పడినదిగదా! అనగా సంస్కృత కావ్యమైనను తెలుగు కావ్యమైనను నిరాటంకముగా రాయగల ప్రౌఢత యతని స్వమతమన్నమాట!
మ: హృదయా హ్లాది చతుర్ధ ,మూర్జిత కధోపేతంబు నానా రసా
భ్యుదయోల్లాసి, విరాట పర్వ మట, యుద్యోగాదులం గూడగా
బదునేడింటఁ దెనుంగుఁ జేసెద - నని విరాట పర్వారంభంలో తిక్తన గారికథనము. ఇందుమనకు"నానారసాభ్యుదయోల్లాసి"యను భాగము అవసర పడి యున్నది; విరాట పర్వము పెక్కురసముల కు కూడలి యనిదీనివలన దేలుచున్నది. రసపోషణమున దిక్కనకు సాటి రాదగిన కవియరుదు. రసపోషణమీతని కవితా గుణములలో3వ స్థానము నాక్ర మించుచున్నది. 4 నాటకీయత 5వది తెలుఁగు నుడికారము.
భ్యుదయోల్లాసి, విరాట పర్వ మట, యుద్యోగాదులం గూడగా
బదునేడింటఁ దెనుంగుఁ జేసెద - నని విరాట పర్వారంభంలో తిక్తన గారికథనము. ఇందుమనకు"నానారసాభ్యుదయోల్లాసి"యను భాగము అవసర పడి యున్నది; విరాట పర్వము పెక్కురసముల కు కూడలి యనిదీనివలన దేలుచున్నది. రసపోషణమున దిక్కనకు సాటి రాదగిన కవియరుదు. రసపోషణమీతని కవితా గుణములలో3వ స్థానము నాక్ర మించుచున్నది. 4 నాటకీయత 5వది తెలుఁగు నుడికారము.
భారతమున విశేష భాగమును దిక్కన యనువదించెను దాదాపుగా నవరసములను నతడు పోషించు రచనము నొనర్చినాడు. ప్ర ప్రధమగు విరాట పర్వము ననుసరించి యాతని రస పోషణా సామర్ధయమును బరిశీలింతముగాక! విరాట పర్వమున కీచక సైరంధ్రుల కృతక ప్రణయ ఘట్టమున శృంగారమును( ఆభాసమే గానోపునుగాక) ఉత్తరుని మాటల సందర్భమున హాస్యము. కీచక- భీమసేనుల యుధ్ధ సందర్భమున వీర, రౌద్ర, భయానక, భీభత్స రసములు యితనిచే ననుపమానముగ బోషింపఁ బడినవి. ధర్మజుని(కంకుభట్టు) చేతలలో మాటలలో శాంతము . యిట్లు వివిధ సందర్భ ముల కనుగుణముగా రసపోషణము గావింపఁబడినది . ఉత్తర గోగ్రహణ సందర్భంలో భీతుఁడయిన యుత్తరుఁడుబృహన్నలతో,-
శా: భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే జేరంగ శక్తుండనే!
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే జేరంగ శక్తుండనే!
అనే ఈ పద్యంలో వీర ,భయానక ,అద్భుత రసములను సముచితముగాఁ బోషింపఁబడినవి. రసాను గుణ్యమగు ఆరభటీ వృత్తియు, సుదీర్ఘ సమాసములు, దుష్కర ప్రాసము, సంస్కృత పదాడంబరము; తిక్కన రసపోణకుపక రించిన పరికరములు . కవి సార్వ భౌమ శ్రీనాధుఁడు" వాకృత్తు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు" ఒక్క శ్రీనాధునకేగాదు ఆగామి కవితల్లజుల కెల్లరకు రస పోషణమునకు దారులు దీర్చినది తిక్కనయే ననుట నిస్సందేహము!
నాటకీయత:- తిక్కన కళావిదుఁడుగదా! నాటకీయత కళలో నంతర్భాగమే! లలిత కళలో నాట్య మొకటి. నటయోర్భావమ్ నాట్యమ్!ఃకావున ప్రత్యేకముగా చెప్పవలసిన యక్కర లేకున్నను వాఙ్మయ విమర్శకులెల్లరు దీనిని ప్రత్యేకముగా ఁబేర్కొను చుండుటచే దీనినిక్కడ బ్రస్తావింపకఁ దప్పలేదు. కావ్యము, శ్రవ్యము. నాటకము దృశ్యము. అట్టిదృశ్య స్వభావమును కావ్యమున కాపాదించుట నాటకీయత! భారతము శ్రవ్యమే యైనను దృశ్యము వలె నానంద సంధాయకములగుటచే నిది సిధ్ధింప జేయుటనే మనవారు నాటకీయతగాఁజెప్పుచున్నారు. తిక్కన భాతమున నది పుష్కలము. తిక్కన రచన శ్రవ్యమువలెననిపంచదు. భావుకుఁడగు పాఠకున కది దృశ్య ప్రబంధముం దలపించును. కీచకుని బెదిరించుచు సైరంధ్రి-
శా:-
దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్
గర్వాంధ్య ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్,
గీర్వాణాకృతు లేవురిప్డు నిను లీలం వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం దొనుట తధ్యం బెమ్మెయిన్ కీచకా!
గర్వాంధ్య ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్,
గీర్వాణాకృతు లేవురిప్డు నిను లీలం వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం దొనుట తధ్యం బెమ్మెయిన్ కీచకా!
- అంటోంది. ఈపద్యం
అచ్చు నాటక పద్యాన్ని దలపించుట లేదా! కనులు మూసి హృదయ క్షేత్రంలో గనిపించే యస్త్రీ మూర్తిని జూడుడు; యికనిట్టివి యిందు కోకొల్లలు.
అచ్చు నాటక పద్యాన్ని దలపించుట లేదా! కనులు మూసి హృదయ క్షేత్రంలో గనిపించే యస్త్రీ మూర్తిని జూడుడు; యికనిట్టివి యిందు కోకొల్లలు.
తిక్కన నాటకీయత
చ: వరమునఁబుట్టితిన్ భరత వంశముఁజొచ్చితి, నందు పాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁబొందితి , నీతి విక్రమ
స్థిరులగుఁ బుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపుఁ గాంచితిన్;
సరసిజనాభ! యిన్నిటఁ, బ్రసిధ్ధికి నెక్కిన దాన నెంతయున్;
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁబొందితి , నీతి విక్రమ
స్థిరులగుఁ బుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపుఁ గాంచితిన్;
సరసిజనాభ! యిన్నిటఁ, బ్రసిధ్ధికి నెక్కిన దాన నెంతయున్;
ఉ: నీవు సుభద్ర కంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేతు, వట్టి నను, పంకజనాభ! యొకండు రాజసూ
యావ బృధంబునందు, శుచియై పెను పొందిన వేణిఁబట్టి యీ
యేవురు జూడగా, సభకు నీడ్చె, కులాంగన నిట్లొనర్తురే!
భావన సేతు, వట్టి నను, పంకజనాభ! యొకండు రాజసూ
యావ బృధంబునందు, శుచియై పెను పొందిన వేణిఁబట్టి యీ
యేవురు జూడగా, సభకు నీడ్చె, కులాంగన నిట్లొనర్తురే!
కౌరవ సభకు కృష్ణుడు రాయబారిగాఁ బోవు సందర్భమున ద్రౌపది పల్కిన మాటలు. రెండు పద్యములు తెరపై పాత్ర హావ భావములనుబ్రదర్శిమచుచు బల్కినట్లు లేవా! ఆఘట్టమేగాక, కౌరవ సభలో కృష్ణుని రాయబార ఘట్టమును, తిక్కన నాటకీయతకు నిలువు టద్దములు. వాకోవాక్యనిర్మాణము. పాత్రలయాహార్యము యిట్లుగా యొకటన నేల యన్నియు నాటకీయతను బోషించినవి.
5 నుడికారము:- నుడి కారమనగా భాషలోని సొగసులు. పలుకు బడులు. ఆంగ్లమున(దీనినే యిడియ మాటిక్ గాచెప్పుచందురు. ప్రతి భాషకు నొకపధ్ధతియుండును. వాక్య నిర్మాణమున, క్రియాప్రయోగమున, సామెతలు వాడుసందర్భమున , లోకోక్తులనుపయోగించురీతిలో నొక ప్రత్యేకత గోచరించుచుండును. దానినే మనవారు నుడికారముగాఁ బోర్కొను చున్నారు .
చ: పగ యడగించు టెంతయు శుభం , బదిలెస్స, యడంగునే పగన్
పగ వగగొన్న మార్కొనక యుండగ వచ్చునె? యేరికైన, నే
మిగతి దలంచినన్ బగకు మేలిమి లేమి ధృవంబు కేశవా!
పగ వగగొన్న మార్కొనక యుండగ వచ్చునె? యేరికైన, నే
మిగతి దలంచినన్ బగకు మేలిమి లేమి ధృవంబు కేశవా!
పాఠకులు క్షమించాలి . మధ్యలో నొక పాదము లుప్త మైనది. పుస్తకము లేమి మస్తకమును నమ్మకొంటిని. వార్ధక్యము వంకతో నదినన్ను వచించినది. పోనిండు మనవిశ్లేషణ కిది సరిపోవును. పైపద్యమలో శుభంబు, ధృవంబు, దక్క తక్కిన పదములన్నియు తెలుగు పదములే! చెప్పువిధానమును గమనించితిరా, తెలుగునాట ప్రతియింట నిట్టులనే సంభాషణ సాగుచుండునుగదా! తిక్కన తెలుఁగుఁదనమునకు పెద్ద పీట వేయును . యితని కవితలో తత్సమ పదప్రయోగము అతి విరళము. చెప్పువిధానము, సామెతల నామెతలుగా వాడుట, వాకోవాక్య నిర్మాణము మొన్నగునవి తెలుఁగుఁ దనమునకు మిక్కిలి దగ్గర గానుండును. యిది తిక్కన తెలుఁగు నుడికారము.
కంద పద్య రచన:- యీకవిని పరిచయము చేయు సందర్భమున దీనిని మరువ రాదు. యిది శిల్పమున నొకభాగమగుట దీనినొక ప్రత్యేక లక్షణముగాఁ బేర్కొనుటలేదు.
ముందుగఁజను దినములలో
కందమునకు సోమయాజి ఘనుండందురు - అని కవిచౌడప్ప తిక్కనను కంద పద్యరచన లో మొనగాఁడని ప్రశంసించినాడు. యదార్ధమే! కంద పద్య రచనలో తిక్కనమేటి. యతని కందములలో నొకవిలక్షణత యున్నది." అల్పాక్షరములలో ననల్పార్ధరచనమే కవిత్వము" అని శివకవుల యభిప్రాయము. తిక్కన యాసూత్రమును మన్నించెను . అందుకు సాధనముగా కందమును గ్రహించెను. కొండంత భావమును చిన్న కందములో నిమిడ్చి చెప్పు చాతుర్యము తిక్కన స్వభావము.
కందమునకు సోమయాజి ఘనుండందురు - అని కవిచౌడప్ప తిక్కనను కంద పద్యరచన లో మొనగాఁడని ప్రశంసించినాడు. యదార్ధమే! కంద పద్య రచనలో తిక్కనమేటి. యతని కందములలో నొకవిలక్షణత యున్నది." అల్పాక్షరములలో ననల్పార్ధరచనమే కవిత్వము" అని శివకవుల యభిప్రాయము. తిక్కన యాసూత్రమును మన్నించెను . అందుకు సాధనముగా కందమును గ్రహించెను. కొండంత భావమును చిన్న కందములో నిమిడ్చి చెప్పు చాతుర్యము తిక్కన స్వభావము.
కం:- ఆపదఁ గడవం బెట్టఁగ
నోపి, శుభంబైన దాని నొడఁగూర్పను , మా
కీపుట్టువునకు పాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపిఁ జనియె మహత్మా!
నోపి, శుభంబైన దాని నొడఁగూర్పను , మా
కీపుట్టువునకు పాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపిఁ జనియె మహత్మా!
భారతోద్యోగ పర్వమున కృష్ణుఁడు కౌరవ సభకు రాయబారియై పోవు సందర్భమున ధర్మరాజు కృష్ణుని నన్నమాటల లోనిదీ పద్యము. ధర్మజుఁడు తనమనస్సులోని విషయమంతయు వ్యంగ్యముగా నీపద్యమున సూచించినాడు. మొదటి సంబోధననే పరికింపుఁఢు. మహాత్మా! తోనారంభము.నీవుమహాత్ముఁడవు నీకు చెప్పవలసిన పనియేమి? సర్వము నీవెరుంగుదువు. మేముపడిన కష్టములు నష్టములు పరాభవములను నీకు వివరింపఁబనిలేదు. తండ్రి లేనిపిల్లము. మాకు దిక్కుదేవుడే ఆదేవాది దేవుఁడవగు నీకు చెప్పునదేమి? యైనను నీయొక్కమాట వినుము. మాయాపదలెల్లఁదొలగించి శుభము నొడఁగూర్పగా మాకీజన్మమునకు పాండురాజు మాతండ్రి నిన్ను పెద్దదిక్కుగాఁజూపించెను. యికనీదేభారము.
ధర్మజుని మాటల లోదాగిన మర్మ మిది; కౌరవ, పాండవులలో నేను పెద్ద వాఁడను రాజ్యాధికారము నాదేగదా! కావున యోచించి నన్ను చక్రవర్తిగా చేయుటయే నీకు ధర్మము. అదియే ధర్మ సంస్థాపనము. పరదైవతమవు గావున మావిషమున కడుంగడు జాగరూకత తో వ్యవహారమును జక్తఁబెట్టుము. నీదేభారము. యిన్నివిషయాలు యీచిన్ని కందంలో నిమిడ్చి తిక్కన తనరచనా శిల్పమును యనల్పమైనదానినిగా వెలయింపఁజేసెను . మొత్తముమీద 1.ఉభయకావ్యప్రౌఢి, 2 శిల్పము, 3 కళావేతృత్వము,
4. నాటకీయత, 5 తెలుఁగు నుడికారములు తిక్కన కవితా లక్షణముగా బేర్కొనుట జరిగినది,. స్వస్తి!
4. నాటకీయత, 5 తెలుఁగు నుడికారములు తిక్కన కవితా లక్షణముగా బేర్కొనుట జరిగినది,. స్వస్తి!
తిక్కన కవితా విశేషాలు చక్కగా వివరించారు. పద్యంలోని ఒక పాదం లోపించడం, ఒకటి రెండు చిన్న టంకణ దోషాలు పెద్ద విశేషాలు కాదు. ధన్యవాదాలు మాస్టారూ!నమస్తే!
ReplyDelete