మిత్రులకు శుభోదయం!
మిత్రులారా! ఆంధ్ర సాహిత్య క్షేత్రం లో పసిడి పంటలను పండించిన కవులు అసంఖ్యాకం . వారిది ఒక్కొక్కరిది ఒక్కొక బాణి ఒక్కొక్క వాణి . ఆవిధానం వారి కవతలకు యెట్లు వన్నెను వాసిని సమకూర్చినదో మనము తెలిసి కొందము. నన్నయ మొదలు నారాయణ రెడ్డి వరకు ఒక్కొక్కరిగా సంక్షేపముగా పరిశీలింతము . ముందుగా ఆదికవి నన్నయ భట్టారకుని తో ప్రారంభింతము.
నన్నయ్య భట్టు కవితా విధానము
సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్ధయుక్తి లో
నారసి మేలునా , నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్ధ సూక్తి నిధి, నన్నయభట్టుఁ దెనుంగునన్, మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె, జగధ్ధితంబుగన్;
నారసి మేలునా , నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్ధ సూక్తి నిధి, నన్నయభట్టుఁ దెనుంగునన్, మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె, జగధ్ధితంబుగన్;
నన్నయ భట్టుగా ప్సిధ్ధినందిన నేను భారత సంహితను(వేదమును) రచియించుటకు దీక్షవహించు చున్నాడను. సంస్కృత మందలి భారతమును దెనిగించుటకు నేనుయెన్నుకొన్న విధానమిది.
1 సారమతులైన కవీశ్వరులు ప్రసన్నమైన (ప్రసాదగుణముతోగూడిన సరళమైన) కధార్ధ విధానమును హృదయములయందు పర్యాలోచనమొనరించి మేలుృమేలని ప్రశంసింపగా, భారతమునుతెనిగిస్తున్నానని చెప్పాడు.అయితే లోనారయుటకు వారు సారమతులై యుండాలట! మనకిపుడు సారా మతులేగాని ( ఈమాట నాదికాదు విశ్వ నాధది) సార మతులెక్కడ? వారు లోనారయుటకు ఈలోచనాలు పనకిరావు. సులోచనాలు కూడా వృధాయే! దానికిఆలోచనా లోచనాలనుదెరవాలి. మనస్సులో ఆకధావిధానాన్ని అవలోకించాలి. అదిగో అప్పుడు బోధపడుతుంది అతని కథాకథన విధానం . నన్నయ భారతాన్ని యధామాతృకగా ననువదింపలేదు. కమ్మని కథవింటున్నట్లు మనంభావిచే రీతిగా అనువాదం సాగించాడు. కథాకథనానికి అడ్డం వచ్చే వర్ణనలను తగ్గించాడు. కథవినే పాఠకులకు విసుగు రాని పధ్ధతియది. సుదీర్ఘములైన సంభాషణలను కుదించినాడు. శిశుపాల వధలోనియీపద్యమును పరిశీలించండి .
చ: ఇతనికిఁగూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక! మహాత్ములైన భూ
పతులయు విప్ర ముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁడని యచ్యుతు నర్చితుఁజేయ బాడియే!
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక! మహాత్ములైన భూ
పతులయు విప్ర ముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁడని యచ్యుతు నర్చితుఁజేయ బాడియే!
మూలం లోని దీర్ఘ తరమైన సంభాషణను తగ్గించాడు. ఇదీ యతనికథాకథన విధానం. దీనినే ప్రసన్న కథ గాఁబేర్కొని నాడు.
2 అక్షర రమ్యత - అందంగా అక్షరాలువనిపించటం ( శ్రవణ శుభగంగా) పండితులు కవులు, ప్రసన్న కధని మెచ్చగా,యితరులు- అంటేసామాన్యులు. కొందరు పామరులు అని వింగడించినారు అది తప్పు. అక్షరజ్ఙానమున్నవాడు పామరుఁడెట్లగును? అందుచేత రెండవ వర్గము వారిని సామాన్యులు గనే చెప్ప వలసి యున్నది. వారెల్లరు అక్షర రమ్యతను ఆదరింపగా భారతమును రచించెనట! ఈయక్షర రమ్యత యమకాది శబ్దాలంకారములచే సాధింప వచ్చును. అదేపని చేసినాడు. ఈపద్యమును బరికింపుడు.
చ: రయ వితలత్తురంగమ తరంగములన్ , మదనక్ర నాగ సం
చయముల సంచలచ్చెటుల సైనిక మత్స్యములన్ భయంకరం
బయి యదు వృష్ణి భోజ కుకు రాంధక వాహినియుం గలంగె ని
ర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబు నన్ ;
చయముల సంచలచ్చెటుల సైనిక మత్స్యములన్ భయంకరం
బయి యదు వృష్ణి భోజ కుకు రాంధక వాహినియుం గలంగె ని
ర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబు నన్ ;
రాజసూయాధ్వర సందర్భమున కృష్ణుని పూజించి నందుకు అలిగిన శిశుపాలుఁడు యుధ్ధమునకు తెగపడెను . అతనిని సమర్ధించువారు ( రాజులు) యుధ్ధమునకు తయారైనారు. ఆసంరంభమును ఈపద్యము వివరించు చున్నది. ఒకరా యిద్దరా ,యదు వృష్ణి భోజ కుకుర అంధక దేశములకు జెందినరాజులు వారిమహాసైన్యము . అది యొక పెద్ద సాగరమును దలపించు చున్నది. సారమైతే తరంగాలండాలికదా! యిక్కడ యెగిరెగిరి పడే గుఱ్ఱాలే తరంగాలట! పెద్ద చాపలుండాలికదా! అటునిటు పరుగులుఁదీసే సైనికులే మత్స్యములట! భయంకరమగుట సైన్య సముద్రములకు సమము. ఆసేనాసముద్రం దయారాహిత్య మనే పెనుగాలులకు చెలరేగి పోతున్నదట! అంటే అల్ల కల్లోలంగామారిదని తాత్పర్యం!
ఈసంరంభాన్నంతా ఈవిధంగా పదాడంబరంతో నింపి యాపై రూపకము ఆరోపించి దీనినీ చదువు పాఠకుల మనంబుల కబ్బుపాటొదవించెను. ఇదీయక్షర రమ్యత వలన నన్నయకు గలిగిన ప్రయోజనము. కావున నన్నయ కవితా గుణములు 1 ప్రసన్నకధ 2 అక్షర రమ్యతలు . లనుట. యుక్తము.
ఈసంరంభాన్నంతా ఈవిధంగా పదాడంబరంతో నింపి యాపై రూపకము ఆరోపించి దీనినీ చదువు పాఠకుల మనంబుల కబ్బుపాటొదవించెను. ఇదీయక్షర రమ్యత వలన నన్నయకు గలిగిన ప్రయోజనము. కావున నన్నయ కవితా గుణములు 1 ప్రసన్నకధ 2 అక్షర రమ్యతలు . లనుట. యుక్తము.
No comments:
Post a Comment