సీ: ధరియింప నేర్చిరి దర్భవెట్టిన వ్రేళ్ళ
లీల మాణిక్యాంగుళీయ కములు;
కల్పింప నేర్చిరి గంగ మట్టియ మీద
కస్తూరికా పుండ్రకంబు నొసల;
సవరింప నేర్చరి జన్నిదంబుల మ్రోల
దార హారములు ముత్యాల సరులు;
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
కమ్మని గ్రొత్త చెంగల్వ విరులు;
లీల మాణిక్యాంగుళీయ కములు;
కల్పింప నేర్చిరి గంగ మట్టియ మీద
కస్తూరికా పుండ్రకంబు నొసల;
సవరింప నేర్చరి జన్నిదంబుల మ్రోల
దార హారములు ముత్యాల సరులు;
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
కమ్మని గ్రొత్త చెంగల్వ విరులు;
గీ: ధామముల వెండి పైడియు దడబడంగ
బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు
వేమ భూపాలు నను జన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటములందు;
బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు
వేమ భూపాలు నను జన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటములందు;
కాశీఖండము- అవతారిక-ప
ఆహా! ఏమాఅగ్ర హారముల వైభవము! అల్లాడ వీరభద్రా రెడ్డి పాలనమున బ్రాహ్మణాగ్ర హారములన్నియు సుసంపన్నములయినవి. పాడిపంటలతో దేశము సుభిక్షమై యలరారినది. ప్రజలు వెండి బంగారములతో తులతూగుచుండిరి. దేశమంతయు దేవాలయములకు లలిత కళలకు నిలయ మైనది. భోగకాంతల లోగిళ్ళలో వెన్నెల దివ్వెలు వెలిగినవి. పర రాజుల దండయాత్రలకు సుదూరమగుట ప్రభువులు, అధికారులు భోగపరాయణు లైనారు . ఇటువంటి సుఖ మయృసమయ మున విజయ నగర రాజులు పరిసర రాజ్యములకు పండితవివాద సభలలో పాల్గొనుటకు ఆహ్వానముల నంపిరి. ఆపత్రములందు పండిత పరీక్షాధికారిగా " అరుణ గిరి సనాధ! కవిసార్వ భౌమ! గౌడ డింఢిమ భట్టారకుని" పేర్కొనినారు.
సభాముఖముగ నాపత్రగత విషయములు విన్నంతనే శ్రీనాధుని కొడలు మండినవి కటము లదరినవి కోపావేశమున కన్నులెర్రవారినవి .ఔరా! ఏమీగౌడ పండితుని విద్యాహంకారము! ఏమాతని గర్వము. లోకము విశాలమైనది తనకన్న మించిన పండితుడు ఉండకపోవునా? కవిసార్వభౌముడట! పండిత పరీక్షాధికారియట! ప్రాణము లేని యుధ్ధోపయోగి కంచుఢక్క యాతని కీర్తికి ప్రతీకయా! సాటిపండితుల కెంతయవమానము? చూతునుగాక యాతని పస .ఎటులైనను ఆగౌడ పండితు నోడించి, యాతని కంచు ఢక్కని పగుల గొట్టించి, యాతని కవిసార్వ భౌమ బిరుదమును అందుకొనకున్న నేను శ్రీనాధుడనే! అరుణగిరి నాధ! అస్తు! శీఘ్రమేవ తవ గర్వభంగ సిధ్ధిరస్తు! అని మనంబున కృతనిశ్చయుైడైనాడు.
వ విడిది గృహంబునకేగెనేగాని మనస్సునకు నిలుకడ లేకపోయెను, నిద్దుర కరవాయెను. భీమఖండము వింధ్య గర్వ భంగ సందర్భమున మేరు పర్వత ఖ్యాతివిని . వింధ్య పర్వతరాజు పడినపాట్లు గుర్తుకు వచ్చెను.ఆపద్యమును చిత్తగించండి;
ఉ: కంటికి నిద్రవచ్చునె, సుఖంబగునే రతి కేళి, జిహ్వకున్
వంటక మిందునే, యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవు డొకండు తనంతటి వాడు గల్గినన్;
వంటక మిందునే, యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవు డొకండు తనంతటి వాడు గల్గినన్;
కాశీఖండము - ప్రధమ- ఆశ్వా-108 పద్యం;
శత్రువును జయించు నందాక కంటికి నిద్ర రాదట! రతికేళియు సుఖప్రదము కాదట! నోటికి తిండి పోదట!తక్కినవైభము లెన్నియున్నను మనస్సు కెక్కవట! అభిమానవంతునకు తనకంటె మిన్నయైన శత్రువు కన్న మించిన కష్టము లేదట! తుదకు తనవర్ణన తనకే యెదురు వచ్చినట్లయినది . కొన్నిరోజులాబాధ ననుభవించుచు, సకల శాస్త్రములను మధించి మంచి ప్రావీణ్యమును గడించి . వేమారెడ్జి యనుమతినొంది. వీరభద్రారెడ్డిని మైత్రీపూర్వకముగా సెలవుకోరి ముందుగా కొండవీటికి ప్రయాణ ప్రస్థానము నారంభించెను.
నేటికి నింతవరకు నిల్వరింతముగాక!
No comments:
Post a Comment