సీ: తారకా మందార తారాచలంబుల
తో రాయు నెవ్వాని చారు కీర్తి,
తో రాయు నెవ్వాని చారు కీర్తి,
భావ సంభవ భద్ర దేవేంద్ర సూనుల
మరపించు నెవ్వాని మహిత కీర్తి.
మరపించు నెవ్వాని మహిత కీర్తి.
జీమూత వాహన శిబి సూర్య తనయుల
ధట్టించు నెవ్వాని దాన కీర్తి,
ధట్టించు నెవ్వాని దాన కీర్తి,
భార్గవ గార్గ్య గీష్పతి మతి ప్రౌఢిమ
నిరసించు నెవ్వాని నిశిత బుధ్ధి,,
నిరసించు నెవ్వాని నిశిత బుధ్ధి,,
గీ: అతఁడు రిపు రాజ రాజ్య సప్తాంగ హరణ
కరణ పరిణత యుక్త ప్రకాశమానుఁ
డతులితాచారవిజిత గంగాత్మజుండు,
మర్త్య మాత్రుండె? వల్లభా మాత్య వరుఁడు!
కరణ పరిణత యుక్త ప్రకాశమానుఁ
డతులితాచారవిజిత గంగాత్మజుండు,
మర్త్య మాత్రుండె? వల్లభా మాత్య వరుఁడు!
భావం:- తారకలను, మందారమనే కల్ప వృక్ష మును, వెండికొండను, ఎవనికీర్తి మరపించునో! మన్మధుడు, ప్రద్యుమ్నుడు, జయంతుడు, మొన్నగువారి సుందరాకారుల నెవరి రూపము మరపింప జేయునో? జీమూతవాహనుడు , శిబి, కర్ణాదుల దానగుణము నెవ్వని కీర్తి తిరస్కరించునో! శుక్ర, గార్గ్య, బృహస్పతుల మేధాశక్తి నెవరి నిశిత బుధ్ధి నిరసించునో! వైరి రాజుల సప్తాంగ హరణ విద్యలో నెవడు ఆరితేరిన మొనగాడో! సాటిలేని సదాచార పరాయణమున నెవడు భీష్ము ని ఉపమించునో ! అతడె వల్లభామాత్యుడు! అతడు మానవ మాత్రుడా? కాదు. దేవ తుల్యుఁడని కవి యభిప్రాయము.
శ్రీ నాధుడిప్పుడు కృష్ణాతీరము నుండి సపరివారుడై ఓరుగల్లు వయిపు ప్రయాణమను సాగించు చున్నాడు. ఓరుగల్లు కాకతి రాజధాని. ప్రతాపరుద్రుని పాలనము. ఆకాకతి సామ్రాజ్య రాజ భాండారమునకు అధిపతి వల్లభామాత్యుఁడు. శ్రీనాధుని ప్రాణ స్నేహితుడు. వినుకొండ వారి స్వగ్రామము. మోపూరున కధిపతి. సర్వ రాజ్య రక్షాదక్షుడు. శ్రీనాధునకు అన్నివిధముల తగినవాడు. శృంగార రసైకజీవి. భోగపరాయణుఁడు. స్వయముగా కవి కవిజన పోషకుడు. అట్టి తన మిత్రుని సహకారమున నెటులైనను విజయనగర రాజులకడ పరపతిని సంపాదింప వలెనను ప్రయత్నమున వల్లభరాయుని కలుసు కొనుటకు శ్రీనాధుడు ఓరుగంటికి పయనమైనాడు.
వల్లభరాయని తండ్రి, తాతలు విజయ నగర ప్రభువులకడ భండాగార రక్షకులై కర్ణాటక రాజుల య భిమానమునకు పాత్రులయినారు. కావున వల్లభుని సిఫారసు తో డిండిముని ఎదిరించు కార్యక్రమము నిర్విఘ్నముగా నిర్వ హింపవలెనని శ్రీనాధునితలంపు. మనమిప్పుడు ఓరుగల్లునకు బహుసమిపమునకు వచ్చియున్నారము. ప్రయాణమునకు కొంత విశ్రాంతి నొసగి, తన రాకను మిత్రున కెరిగింప వర్తాహరుని ఓరుగంటికి పంపెను.
మిత్రుని రాకకు పరమానంద భరితుడై వల్లభామాత్యుడు కొండవీటి విద్యాధికారి యగు శ్రీనాధునకు అతని పరివారమునకు ఘనమైన స్వాగతృసత్కారములకు యేర్పాట్లు గావించెను. వేదోక్త ప్రకారము పూర్ణకుంభ స్వాగతము పచరించి నగరవీధులలో నతడు వచ్చమార్గము నంతయు తోరణ సందోహములతో నలంకరింప జేసెను. మార్గమంతయు సుగంధభరితమగు పూలను బరపించెను. మిత్రునకు యతని పరివారమునకు సర్వోపచారములను సల్పుటకై లక్ష్మణ వఝ్ఝలయింట విడిది యేర్పాటు గావించెను.
నాటియోరుగల్లులో నావఝ్ఝలవారి యిల్లు పూటకూటిల్లు గాజగత్రసిధ్ధము. నేటి5స్టార్ హోటళ్ళ కేమాత్రము తీసిపోదు.
ఉ: రప్పుర భోగి వంటకము, కమ్మని గోధుమ పిండివంటయున్
గుప్పెడు పంచదారయును, క్రొత్తగ గాచిన యాలనే, ర్పెస
ర్పప్పును, కొమ్ముటనంటి పండ్లును, నాలుగునైదునంజులున్,
లప్పల తోడ గ్రొంబెరుగు, లక్మణ వఝ్ఝల యింట రూకకున్!
గుప్పెడు పంచదారయును, క్రొత్తగ గాచిన యాలనే, ర్పెస
ర్పప్పును, కొమ్ముటనంటి పండ్లును, నాలుగునైదునంజులున్,
లప్పల తోడ గ్రొంబెరుగు, లక్మణ వఝ్ఝల యింట రూకకున్!
ఆహా! ఎంత చక్కని భోజనము! భోజనమునకేగాదు సకల సౌకర్యములకు భాజనమైనది వఝ్ఝలయిల్లు. వలసిన వారికి మదిర మగువలకును కొదవలేదు. వచ్చిన వారు రాజ బంధువులాయె వారడిగినదే తడవుఅన్నియు నరనిముసమున నందుబాటులో నుండుచున్నవి. శ్రీనాధుడు కోరుకొన్నదియు నిదియే ! వల్లభుని దయతో నతని భుభుక్షలు(ఆకలి) రెండును తీరినవి. పరమోల్లాస భాసురు డైనాడు. పరమానంద ము గల్గినది; మిత్రునకు ప్రతి కృతిగా నేదేని నిరుప మానమైన కానుక నొసగ వలెనని సంకల్పించు కొన్నాడు;
నేటికింతటితో నిల్వరింతము రేపు క్రీడాభిరామ కృతి నిర్మాణమునకు కడంగుటనుబరిశీలింతము. శ్రీనాధ- వల్లభామాత్యుల అభిరుచులు, వానిపర్యవసానములను చెవులారవిని, మనసారచదువుకొని ముందుకు బోవుదము
No comments:
Post a Comment