సీ: సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య
భాషా పరిజ్ఙాన పాటవంబు;
భాషా పరిజ్ఙాన పాటవంబు;
పన్నగపతి సార్వభౌమ భాసిత మహా
భాష్యవిద్యా సమ భ్యాస ఫలము;
భాష్యవిద్యా సమ భ్యాస ఫలము;
అక్షపాద కణాద పక్షిలో దీరిత
న్యాయ కళా కౌశ లాతిశయము;
న్యాయ కళా కౌశ లాతిశయము;
శ్రుతి పురా ణాగమ స్మృతి సాంఖ్య సిధ్ధాంత
కబళన వ్యుత్పత్తి గారవంబు;
కబళన వ్యుత్పత్తి గారవంబు;
గీ: పూర్వ కవిముఖ్య విరచితాపూర్వ కావ్య
భావరస సుధా చర్వణ ప్రౌఢతయును;
శృంగార నైషధావతారిక లో కృతిపతి మామిడి సింగన శ్రీనాధుని గొనియాడుచు చెప్పిన పద్యమిది. దీనిని బట్టి సంస్కృతము, ప్రాకృతము, శౌరసేనీ ఇత్యాది భాషాపాటవము. పాతంజలి వ్యాకరణ మహాభాష్య ము నభ్యసించిన ఫలము, గౌతమ, కాణాదాది ధర్మ సూత్ర కారుల ధార్మిక విధానములు, వేదములు, పరాశరాది స్మృతుల పిరిచయము, సాంఖ్య శాస్త్ర మును పుక్కట బట్టుట చేత గల్గిన పాండిత్యము. వాల్మీకి వ్యాస భాస కాళిదాస హర్ష
భవభూత్యాది మహాకవుల రచనలను చదువుటవలన గలిగిన కావ్యజ్ఙానము శ్రీనాధునకు అపారముగా గలదని స్పష్ట మగుచున్నది. ఇదిగాక ,
భవభూత్యాది మహాకవుల రచనలను చదువుటవలన గలిగిన కావ్యజ్ఙానము శ్రీనాధునకు అపారముగా గలదని స్పష్ట మగుచున్నది. ఇదిగాక ,
శా: బ్రాహ్మీ దత్త వర ప్రసాదుడ వురు ప్రజ్ఙా విశేషోదయా
జిహ్మ స్వాంతుడ వీశ్వరార్చన కళాశీలుండ వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మ జ్ఙాన కళానిధానమవు ; నీభాగ్యంబు సామాన్యమే!
జిహ్మ స్వాంతుడ వీశ్వరార్చన కళాశీలుండ వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మ జ్ఙాన కళానిధానమవు ; నీభాగ్యంబు సామాన్యమే!
శ్రృంగార నైషధము - అవతారిక;
పైపద్యమును బట్టి యీతడు సరసవతీ వరప్రసాదు డని తేటమగుచున్నది. ఇకనతని పాండిత్యమునకు అడ్డేమికలదు? ప్ర జ్ఙ లో (ప్రతిభ) ఆదిశేషుని తోసమానమట ! ఇంక వాదనలో నతనిని మించువాడెవడు? యీశ్వరార్చన కళాశీలత్వము వలన పరమేశ్వర కృపాపాత్రుడు. తిరుగేమున్నది? 18 పురాణములతో కూలంకషమైన పరిచయము బ్రహ్మ జ్ఙానత్వమును నమకూర్చినది. ఈరీతిగా భౌతిక ఆది భౌతిక విద్యలలో కుత్తుక బంటి పాంజిత్యముగల యితనినెదిరించి నిలుచుట యసాధ్యము. కావున శ్రీనాధుని ధైర్యమునకు ఇవియన్నియు కారణములైనవి.
కతిపయ ప్రయాణముల మహాకవి కొండవీటికి చేరినాడు. వేమారెడ్డి మహోత్సాహముతో సపరివారుడై యెదురేగి తనవిద్యాధికారికి అపూర్వ మైన స్వాగత సత్కారములను జరిపించినాడు. శ్రీనాధుడును వేముని సాదర సత్కారమునకు సంతోషించినాడు. కొంతకాలము రాజకార్యములను చక్కదిద్ది మరికొంతకాలము తనవిద్యలకు పదును బెట్టుకొని శ్రీనాధుడు విజిగీషుడై విద్యానగర ప్రయాణమునకై సన్నాహములను చేయసాగెను. వేమారెడ్డికి తనపూన్కి నెరిగించి విద్యయానగరమునకేగి గౌడ డింఢిమ భట్టారకునితో పండిత వివాదమున దలపడుటకు , అనుమతిని గోరినాడు.
వేమారెడ్డికి పట్టరాని యానందమాయెను. నేటికి గదా విద్యానగర ప్రభువులకు తమరాజ్యమునందలి పండితుల పాండిత్య ప్రకర్ష ను ప్రకటించు నవకాశము చిక్కినదిగదా యనిమనంబున పొంగిపోయెను. శ్రీనాధుని సత్తువ యతడెరుంగునుగదా? తప్పక నతడు విజయుడై తమరాజ్య గౌరవము నినుమడింప జేయునని నమ్మినాడు. శ్రీనాధుని ప్రయాణమునకు వలసిన యానసౌకర్య ములను సమకూర్ప నాదేశంచెను. ప్రయాణ మార్గము కూడ నిర్దేసింప బడినది.వలసిన మార్గసూచికలు(మ్యాపులు) తయారుగావింపబడెను. ఒకానొక శభముహూర్తమున రాచపరివారము రాజగు వేమారెడ్డియు విజయ నినాదములతో సాదరమైన వీడ్కోలుపలుక శ్రీ నాధ మహాకవి సముచిత పరివారముతో విజయనగర మార్గాను సారియైనాడు.
నేటికీవిషయము నిమతటితో నాపుదము. రేపు మార్గ మధ్యమున తనచాటు పద్యమలవాన చే పాఠకులనెట్లు మురిపించి మై మరపించునో పరిశీలింతము గాక! సెలవు! శుభంభూయాత్!
No comments:
Post a Comment