మ:మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీద్రుండు త
న్మహనీయస్థితి మూలమైనిలువ శ్రీనాధుండు బ్రోవన్ మహా
మహులై సోముడు భాస్కరుడు వెలయింపన్ సొంపువాటిల్లు నీ
బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమున తత్ప్రా గల్భ్య మూహించెదన్ !
న్మహనీయస్థితి మూలమైనిలువ శ్రీనాధుండు బ్రోవన్ మహా
మహులై సోముడు భాస్కరుడు వెలయింపన్ సొంపువాటిల్లు నీ
బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమున తత్ప్రా గల్భ్య మూహించెదన్ !
అవతారిక- వసుచరిత్రము; రామరాజ భూషణుడు;
ప్రబంధకవులలో ప్రముఖుడైన రామరాజ భూషణుడు శ్రీనాధుని ఆంధ్రవాఙ్మయ పోషకుడైన విష్ణుమూర్తియని
యభివర్ణించినాడు. నిజమే! కవిత్రయానంతరం తనరచనలతో ఆంధ్రవాఙ్మయాన్ని పరి పుష్ఠి యొనరించి మరింత
వేగముగాముదుకు నడిపించినాడనుట యదార్ధమే!
యభివర్ణించినాడు. నిజమే! కవిత్రయానంతరం తనరచనలతో ఆంధ్రవాఙ్మయాన్ని పరి పుష్ఠి యొనరించి మరింత
వేగముగాముదుకు నడిపించినాడనుట యదార్ధమే!
ఇంతకు శ్రీనాధు డెవడు? ఏప్రాంతమువాడు?వివరములెవ్వి? యను ప్రశ్నలు రాకమానవు.
కావున ముందుగా ఆసమాచారమును సమీక్షింతము. గ్రంధాధారములను బట్టి యతడు పాకనాటి నియోగి
బ్రాహ్మణుడని తెలియు చున్నది. శ్రీనాధకవి తన రచన భీమేశ్వర పురాణమును బెండపూడి అన్నయ మంత్రికి
అంకితమొనరంచెను. గ్రంధావతారికలో కృతిపతి "పాకనాటింటివాడవు బాంధవుడవు" అని కవిని ప్రస్తుతి
చేయుటచేతను, శ్రీనాధుడు తన తాతగారినిపరిచయము చేయుచు -_
కావున ముందుగా ఆసమాచారమును సమీక్షింతము. గ్రంధాధారములను బట్టి యతడు పాకనాటి నియోగి
బ్రాహ్మణుడని తెలియు చున్నది. శ్రీనాధకవి తన రచన భీమేశ్వర పురాణమును బెండపూడి అన్నయ మంత్రికి
అంకితమొనరంచెను. గ్రంధావతారికలో కృతిపతి "పాకనాటింటివాడవు బాంధవుడవు" అని కవిని ప్రస్తుతి
చేయుటచేతను, శ్రీనాధుడు తన తాతగారినిపరిచయము చేయుచు -_
చ:కనక క్ష్మాధర ధీరు వారిధితటీ క్రాల్పట్టణాధీశ్వరున్
ఘనునిన్ బద్మపురాణ సంగ్రహకళా చాతుర్యధీ ధుర్యునిన్
వినమత్ కాకతి సార్వభౌము, కవితా విద్యాధరున్ గొల్తు మా
యనుగుందాత! ప్రదాత! శ్రీ కమల నాభామాత్య చూడామణిన్!
- అంటూప్రస్తుతి చేయుటచే
ఘనునిన్ బద్మపురాణ సంగ్రహకళా చాతుర్యధీ ధుర్యునిన్
వినమత్ కాకతి సార్వభౌము, కవితా విద్యాధరున్ గొల్తు మా
యనుగుందాత! ప్రదాత! శ్రీ కమల నాభామాత్య చూడామణిన్!
- అంటూప్రస్తుతి చేయుటచే
నిమ్మహాకవి పాకనాటినియోగియనుట నిశ్చయము. తాతకమలనాభుడు కనుక మనుమని పేరు
శ్రీనాధుడైనది. నాటిసాంప్రదాయమదియేకదా! మారన- లక్ష్మమలు తలిదండ్రులని వినికిడి.(పరిశీలింపవలసియున్నది)
ఇతనికి భాగవత కర్తయగు బమ్మెర పోతనతో బావ- బావమరదుల సంబంధము;
ఆహా! ఎంతవిచిత్రము? ఎక్కడిపాకనాడు? ఎక్కడి నిజాముప్రాంతము? ఇట్టి దూర సంబంధములు నాడు
అరుదు. అస్తు! దానితో మనకిప్పుడు పనిలేదు. ముందుముందు అవసరపడినపుడు చూచికొందము.
శ్రీనాధుడు పుట్టుకవి. చిన్నటనే కావ్యములల్లిన మేధావి యని కాశీఖండము లోని యీ
పద్యము సాక్ష్య మొసగు చున్నది.
పద్యము సాక్ష్య మొసగు చున్నది.
సీ: చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు
రచియించితిని మరత్తరాట్చరిత్ర;
నూనూగు మీసాల నూత్న యవ్వనమున
శాలివాహన సప్తశతి నొడివితి;
సంతరించతి నిండు యవ్వనంబున యందు
హర్ష నైషధ గ్రంధ మాంధ్ర భాష;
ప్రౌఢ నిర్భరవయః పరిపాకమున
గొనియాడితిని భీమనాయకునిమహిమ;
గీ: ప్రాయమింతకుమిగులగ్రైవాలకుండ ,కాశికాఖండమను మహాగ్రంధమేను
దెనుగు జేసెద; కర్ణాట దేశకటక , పద్మ వన హేళి శ్రీనాధభట్ట సుకవి;
రచియించితిని మరత్తరాట్చరిత్ర;
నూనూగు మీసాల నూత్న యవ్వనమున
శాలివాహన సప్తశతి నొడివితి;
సంతరించతి నిండు యవ్వనంబున యందు
హర్ష నైషధ గ్రంధ మాంధ్ర భాష;
ప్రౌఢ నిర్భరవయః పరిపాకమున
గొనియాడితిని భీమనాయకునిమహిమ;
గీ: ప్రాయమింతకుమిగులగ్రైవాలకుండ ,కాశికాఖండమను మహాగ్రంధమేను
దెనుగు జేసెద; కర్ణాట దేశకటక , పద్మ వన హేళి శ్రీనాధభట్ట సుకవి;
No comments:
Post a Comment