కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
సీ: రాజీవ భవుని గారాపుఁ బట్టపు దేవి ,
యంచ బాబా నెక్కు నలరుఁ బోణి;
యంచ బాబా నెక్కు నలరుఁ బోణి;
పసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాఁగ ,
పదునాల్గు విద్యల పట్టుఁ గొమ్మ;
పదునాల్గు విద్యల పట్టుఁ గొమ్మ;
యీరేడు భువనంబు లేలు సంపద చేడె,
మొలక చందురుఁదాల్చు ముద్ద రాలు;
మొలక చందురుఁదాల్చు ముద్ద రాలు;
వెలిచాయ కొదమరా చిలుక నెచ్చెలి కత్తె ,
ప్రణవ పీఠిక నుండు పద్మ గంధి ;
ప్రణవ పీఠిక నుండు పద్మ గంధి ;
తే: మంధరాచల కంధర మధ్యమాన
దుగ్ధ పాదోధి లహరి కోద్భూతయైన
లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగు
వరదయై మాకు వినత గీర్వాణి వాణి!
దుగ్ధ పాదోధి లహరి కోద్భూతయైన
లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగు
వరదయై మాకు వినత గీర్వాణి వాణి!
భావము:- బ్రహ్మ దేవుని ముద్దుల భార్య, యంస వాహన మెక్కు పూబోణి. బంగరు వీణ వాయించు జవ్వని, పదునాల్గు విద్యలకు ఆధారమైనది. యిరు+ ఏడు - పదనాల్గు లోకములను పాలించు లక్ష్మికి నెచ్చెలి, చంద్ర రేఖను ధరించెడు ముద్దరాలు. తెల్లని పరువము గల రాచిలుకకు ప్రియ సఖి, ప్రణపీఠంలో(ఓంకార నాదమందు) నివసించు పద్మ గంధి.
మందరాచల సదృశమైన నడుమున నొప్పుచు, పాల సంద్రపు టలల నుండి యుద్భవించినదియు, సుందరమైన సాహిత్య పు సంపదలతో లోరహితముల నొసగు గీర్వాణి వాణి మాకు వరదాయిని యగునుగాక! యని దీనిభావము. శ్రీనాధుని వర్ణావైభమునకు కాణాచి యైన యీపద్యము సకల విద్యా రాణి వాణిని వర్ణించిన పద్యములలో నద్వితీయమైనది; ఇకప్రస్తుతము -
మందరాచల సదృశమైన నడుమున నొప్పుచు, పాల సంద్రపు టలల నుండి యుద్భవించినదియు, సుందరమైన సాహిత్య పు సంపదలతో లోరహితముల నొసగు గీర్వాణి వాణి మాకు వరదాయిని యగునుగాక! యని దీనిభావము. శ్రీనాధుని వర్ణావైభమునకు కాణాచి యైన యీపద్యము సకల విద్యా రాణి వాణిని వర్ణించిన పద్యములలో నద్వితీయమైనది; ఇకప్రస్తుతము -
మరునాడు వేమారెడ్డి నిండు కొలువున గూర్చుండి , కవిసార్వభౌమునకు కబురంపినాడు. శ్రీనాధుఁడు అనుష్ఠానమును ముగించుకొని ప్రతీహారులు దారిఁజూపఁగా , వందిమాగధులు జయజయధ్వానములను సేయుచుండగా చిరునవ్వులు రువ్వుచు సభలో ప్రవేశించి రాజసమీపమున గల యుచితాసనము నలంకరించెను. వేమారెడ్డి యాతనిని బహుథా ప్రశంసించి , మనశ్రీనాధ కవి చంద్రు లిప్పుడు సుకవి జన సార్వభౌములైనారు. నేటినుండి మనము వారినట్లే సంభావింతుము గాక! యిది వారియొక్కరి విజయమేగాక, మనకొండవీటి రెడ్డి రాజ్యమున కంతటికిని సమకూరిన యఖండవిజయము విద్యాధికారులై వారుమన కొలువున నుండుట మనయందరి యదృష్టము. ఇంతటి మహావిజయమును సమకూర్చి మనకు మనరాజ్యమునకు యఖండ గౌరవ మాపాదింపఁజేసిన కవిసార్వభౌముల కిదియే మాఘన సన్మాన మనుచు, కర్పూర తాంబూల సహితముగా కొంత సువర్ణ మును బంగరు పళ్ళెర మందుంచి దుశ్శాలువను గప్పి యతనిని ఘనముగాసత్కరించెను,
సత్కారానంతరము వినయ వినమిత గాత్రుఁడయి కవిసార్వ భౌముఁడు " ప్రభూ! మీయండ దండలు లేనిచో నాకీ కార్యము సాధ్యమయ్యెడిదా! యసాధ్యమైన దానిని మీదయతో సుసాధ్య మొనరింప గలిగితిని. ఇదియంతయు తమ యనుగ్రహమే! అందుకు సర్వదా తమకు కృతజ్ఙుఁడను. తమదయ నెల్లవేళలనిటులే నాయందుంచుడు; నేను కవిసార్వ భౌముఁడనైనను తమ కొలువున నెప్పటియట్ల భృత్యుఁనే! " యనిపలుక వేమారెడ్డి సంతసించి యతని విజయ యాత్రావిశేషములను సవివరముగా వినగోరెను. శ్రీనాధుఁడును ప్రభువునకు సభ్యులకు నమస్క రించి జగదంబ యగు సరస్వతీ మాతను మనసార ప్రార్ధించి తనవిజయ గాధను సర్వమును సవివరముగా వివరించెను.
యాత్రా కధనము పూర్తియైన వెనుక వేమారెడ్డి " కవిసార్వభౌమా! తమరు విజయ నగరము నుండి మగిడి వచ్చుచు మనవైరి కూటమికిఁజెందిన రాచకొండ దుర్గమున కేగుటయేగాక, యాసింగమ భూపాలుని సర్వజ్ఙుఁడని బొగడినారట! కొండవీటి విద్యాధికారులగు మీకిది యుచితమా? యనిప్రశ్నించెను. శ్రీనాధుని యూహ నిజమైనది యీవిపత్తును ముందు యూహించినదే గదా!
ప్రభువుల సంప్రశ్నమునకు శ్రీనాధుడెంతమాత్రము వెరగు పడలేదు. చిరువగవులు చిందించుచు, " ప్రభూ! యేమిసేతును పరిస్థితు లట్లొనరించినవి. అదియుగాక, నతనిని మంచిమాటలతో మనపక్షమునకుఁద్రిప్పుటకు ప్రయత్నము జేయుట కదియే తగిన యదననిభావించితిని. యతనియాహ్వానమును మన్నించి రాచకొండ కేగినమాట వాస్తవము. నేనేదో యతనిని పొగడి పొగడి పెద్దనొనర్చితి నను మాటమాత్రమ యదార్ధము. సింగమనీనికి ' సర్వజ్ఙ' బిరుదమున్నది. అదియతడు తనకు తానై వరించినాడో లేక యాశ్రిత బృందమిచ్చిరో దెలియదు. దాని నుపయోగించుకొని నేనతనిని వెక్కిరించి, వెర్రినిఁ జేసివచ్చితిని. అజ్ఙత చేనతఁడాపద్యములోని భావము నేమాత్ర మెరుంగక నన్ను సత్కరించినాడు. ప్రభూ! తమరా పద్యమును చిత్తగింపుడు ,
కం:- సర్వజ్ఙ! నామధేయము శర్వునకే!
రావు సింగభూపాలునకేయుర్వింజెల్లును?
తక్కొరు సర్వజ్ఙుండనుట,
గుక్క గుక్క సామజ మనుటే!
యనిగచ్చిగా చదివెను. అదివిని సభ్యు లెల్లరు హర్ష ధ్వానము లొనరింప సభయంతయు నవ్వులతో మారుమ్రోగెను. ఇంతకు కాకుస్వరమును మార్చి చదువుటచే నాపద్యమందలియర్ధమంతయు పూర్తిగామారిపోయినది. " సర్వజ్ఙుఁడను పేరుయీశ్వరునకొక్కరికే తగును, అట్లుగాక నితరులను సర్వజ్ఙుఁడనిన, కుక్కను యేనుఁగని చెప్పినట్లగును." అనగా- సర్వజ్ఙుఁడననిపేరు పెట్టుకొన్నంత మాత్రమున యీశ్వరుఁడొక్కడు దక్క తక్కనవారు సర్వజ్ఙులగుదురా? కుక్క కుక్కే! యేనుగు యేనుగే! కుక్కనుజూపి యేనుగన్న నెట్లగును? " అనిదీని భావము!
ఔరాశ్రీనాధా! యెంత చమత్కారివయ్యా! అందుచేతనే నీవు కవిసార్వ భౌముఁడవైనావు. నీముందెవ్వరాగ గలరయ్యా! నీధిషణకు నానమస్కార సహస్రంబులు. వేమారెడ్డి పరమానంద భరితుఁడై లేచివచ్చి శ్రీనాధుని కౌగిలితో సంభావించెను. " నోరున్న దలకాయు నను లోకోక్తి యదార్ధ మైనది గదా!
నేటి కింతటి తోమన ప్రసంగము నాపుదము రేపు తక్కిన విషయములను ముచ్చటింతుముగాక! సెలవు!
No comments:
Post a Comment