కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
సీ: కబరికా భారంబు గై పెక్కు విరులతో
నవటు భాగంబుపై నత్తమిల్ల;
నలతి లేఁ జెమటచే నసలుకొన్న లలాట
కుంకుమంబునఁ జిన్ని కురులు మునుఁగఁ
కుంకుమంబునఁ జిన్ని కురులు మునుఁగఁ
బసిఁడి కుండలబోలు పాలిండ్ల భరమున
సన్నపుఁ గౌదీఁగె జలదరింపఁ ;
సన్నపుఁ గౌదీఁగె జలదరింపఁ ;
ధవళ తాటంక రత్న ప్రభా రింఛోళి
గండ స్ధలంబులఁ గౌగిలింపఁ;
గండ స్ధలంబులఁ గౌగిలింపఁ;
తే: కాశికారామ కల్ప వృక్షముల నీడఁ,
గుదప వేళలయందు నాకొన్నవారి ,
కమృత దివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి !
శాశ్వతైశ్వర్యములు కృతి స్వామి కొసఁగు;
గుదప వేళలయందు నాకొన్నవారి ,
కమృత దివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి !
శాశ్వతైశ్వర్యములు కృతి స్వామి కొసఁగు;
భావము:- కాశీవిశాలాక్షిని వర్ణించు సందర్భములోనిది. ఇది కాశీఖండ గ్రంధ రచనమునకు నాంది యగుచుండుటచే, నిటనీపద్యమును పరిచయము చేయుచున్నాను. తలలో నలంకరించు పుష్పభారమున సిగ యొకప్రక్కకు వ్రాలగా, చిరు చెమటచే నుదిటి కుంకుమలో ముంగురులు చిక్కు బడగా, బంగరు కడవలను బోలిన వక్షోజముల బరువుచే సన్నని నడుము వణకు చుండగా, తెల్లని కర్ణభూషణ ముల కాంతిసముదాయములు చెంపలపై చిందులేయగా, కాశీక్షేత్రము నందలి కల్ప వృక్షములనీడలో మధ్యాహ్న సమయమున నాకలి గొన్నవారికి యమృద దివ్యాన్నమును వడ్డించు కాశీ విశాలాక్షి గౌరి కృతి భర్త కు శాశ్వతమైన ఐశ్వర్యములను ప్రసాదించు గాక! యనిదీని భావము.
రాణ్మహేంద్ర వరమున గోదావరీ తటమున విడిసి యున్న కవిసార్వ భౌముని స్వాగతించుటకు కోటనుండి ప్రభువు అల్లాడవీర భద్రా రెడ్డియు, నతని యగ్రజుఁడు వేమారెడ్డియు, మంత్రి సామంతులు, వేదపండితులు, వందిమాగధులు, మంగళధ్వానములు దిక్కులపిక్కటిల్ల నరుదెంచినారు . విప్రులు సుస్వర సంధానులై పురుష సూక్తమును, స్వస్తిక మంత్రములను పఠించు చుండ పూర్ణ కుంభముతో నెదురేగి యతనికిృస్వాగతము బలికిరి. వీరభద్రారెడ్డియు, వేమారెడ్డియు, ప్రేమతో తమిదీర శ్రీనాధుని కౌగిలింతలతో సంభావించి బంగరు పల్లకిలో నెక్కించి పుర వీధులలో ఘనముగా నూరేగించుచు కోటలోనికి గొనిపోయిరి. మార్గమంతయు , వందిమాగధుల జయజయ నినాదములతో, పురజనుల యభినందనలతో మారుమ్రోగుచుండ, శ్రీనాధుని పల్యంకిక నెమ్మదిగా పయనించుచు కోటకు చేరినది. వార కాంతా సందోహ మెదురేగి మంగళ హారతుల బాడుచు కోటలోనికి గొనిపోయిరి. శ్రీనాధుఁడు తనకు స్వాగతించిన ప్రభువునకు, రాజ పరివారమునకు కృతజ్ఙతలు వెల్లడించి తనవిడిది గృహంబునకేగెను .
మరునాఁడు నిండు పేరోలగంబున నుండి వీరభద్రారెడ్డి కవిసార్వభౌమునకాహ్వానమంపెను. శ్రీనాధుఁడు సవినయముగా చిరునగవులు చిందించుచు , సభలోప్రవేశించి ప్రభునకు నమస్కరించి యుచితాసన మలంకరించెను. యంత వేమారెడ్డి కోరికపై విజయనగర ప్రస్థానాది విశేషములను వారికెరిగించెను. నాటితో సభముగిసినది;
విడిది కేగిన శ్రీనాధుఁడు శివపూజాతత్పరత్వమున మునిగి చాలతడవు మంత్ర జపము ధ్యానాది కార్యక్రములయందు నిమగ్నుఁడైయుండెను. యతని వ్యవహారము చూచువారికి వింతగానున్నది. యెల్లవేళల విలాసవంతమైన జీవితమును గడుపగోరెడు శ్రీనాధుఁడేల యిట్లు మారెనోవారికంతు బట్టుటలేదు. ఆమాటలు, ఆవెనుకటి చేతలు యిప్పుడు గానవచ్చుటలేదు. పరమ గంభీరమూర్తియై, నిరంతర మేదో సుదీర్ఘపు టాలోచనలలో మనిగి యుండుట వారికాశ్చర్య జనకమైనది. ధ్యాన నిమగ్నుఁడయి యుండువేళల నాతని హృదయమున కాశీఖండ గ్రంధరచనమునకు జెందిన యాలోచన పొటమరించినది.ఒక్కసారిగా తనరచనలను సింహావలోకన మొనరించుకొన్నాడు.
సీ: చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు
రచియించితిని మరుత్త రాడ్చరిత్ర;
రచియించితిని మరుత్త రాడ్చరిత్ర;
నూనూగు మీసాల నూత్న యవ్వన మున
శాలివాహన సప్తశతి నొడవితి;
శాలివాహన సప్తశతి నొడవితి;
సంతరించితి నిండు జవ్వనంబున యందు
హర్ష నైష ధ కావ్య మాంధ్ర భాష;
హర్ష నైష ధ కావ్య మాంధ్ర భాష;
ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున
గొనియాడితిని భీమనాయకుని మహిమ ;
తే: ప్రాయ మింతకు మిగుల గ్రైవాలకుండ
కాశికాఖండ మను మహా గ్రంధ మేను
దెనుఁగుఁ జేసెద; కర్ణాట దేశ కటక
పద్మ వన హేళి శ్రీనా ధ భట్ట సుకవి;
గొనియాడితిని భీమనాయకుని మహిమ ;
తే: ప్రాయ మింతకు మిగుల గ్రైవాలకుండ
కాశికాఖండ మను మహా గ్రంధ మేను
దెనుఁగుఁ జేసెద; కర్ణాట దేశ కటక
పద్మ వన హేళి శ్రీనా ధ భట్ట సుకవి;
ఆహా! అప్పుడే వయసు వాటారు చున్నది. ఫలిత కేశములు ప్రారంభ మైనవి . యెంతకాలము శరీరమున నోపిక యుండును!? ఓపికయున్నప్పుడే తలచినకార్యములు పూర్తి యొనరింపవలె. నిక కాశీఖండమును శరవేగముగా రచించి కృత కృత్యతను పొందె దను గాక!యనినిశ్చయిచుకొనెను. శ్రీనాధకవి లోకోత్తరమైన ప్రౌఢ కావ్యరచనకు గడంగెనను విషయము వేమారెడ్డికి దెలిసినది ప్రాప్త కాలజ్ఙుండగు నారెడ్డి ప్రభువు మరునాటి సభలో శ్రీనాధుని యవ్విధమున పొగడుట కుపక్రమించెను.
సీ: వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండ లీలల నొక్క మాటు;
నుద్దండ లీలల నొక్క మాటు;
భాషింతు నన్నయ భట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు;
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు;
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు;
భ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు;
పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు ;
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు ;
తే: నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పి నాడవు మాకు నాశ్రితుఁడ వనఘ!
యిపుడుఁ జెప్పఁదొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర!
చెప్పి నాడవు మాకు నాశ్రితుఁడ వనఘ!
యిపుడుఁ జెప్పఁదొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర!
శా:- ఈక్షోణిన్ నిను బోలు సత్కవులు లేరీ నేఁటి కాలంబునన్,
దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజ ద్వయ కుంభి కుంభ ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ధ్యక్షించున్, కవిసార్వభౌమ! భవ దీయ ప్రౌఢ సాహిత్యముల్! - అనిపలికి నాడు.
దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజ ద్వయ కుంభి కుంభ ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ధ్యక్షించున్, కవిసార్వభౌమ! భవ దీయ ప్రౌఢ సాహిత్యముల్! - అనిపలికి నాడు.
భావము: ఈ రెండు పద్యములను విడదీయవీలుగానివి వేమారెడ్డి పరాక్రమ శీలియేగాక కార్య చాతుర్యము గలవాడు అతడు శ్రీనాధుని ప్రశంసించుచున్నాడు . కేవలము నీవుగొప్పవాడవనుటలేదు. శ్రీనాధుని కవితాగుణములను ముఖ్యముగా పేర్కొను చున్నాడు. " వేములవాడ భీమనవలె ఉద్దండ కవిత్వమును నీవుజెప్పగలవు; నన్నభట్టువలె సంస్కృతాంధ్ర పదసమ్మేళణమున కవిత్వమును జెప్పనోపుదువు. తిక్కన వలెరసోచిత రచనయు నీకు కరతలామలకమే. యెర్రన వలె సూక్తి వైచిత్రతను ఘటియంప నోపెదవు. నీవు సామాన్యుఁడవా! నైషధము మన్నగు రచనల నేక మొనరించిన సుధీమణివి. నీవంటి కవులు లోకముననేడు యెందును గానరారు. దక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరో భామినుల వక్షోజములపై విలసిల్లు కస్తూరీ చందన చర్చల పరీమళవైభవములను శాసించు కవితా పరిమళములు గలవాజవుగదా!
ఇపుడు నీవు రచియించెడు కాశీఖండమను మహాప్రంధమును మాతమ్ముఁడగు వీరభద్రునకు అంకితముగా రచియింపుము" సప్త సంతానములలో కావ్య మొకటిగావున తత్కృతిపతిత్వమున మాకీర్తి యాచంద్ర తారార్కముగా నిలచునట్లు చేయుమని బహువిధముల, శ్రీనాధుని ప్రార్ధించెను".
నేటికింతటితో నీ ప్రసంగమును నిల్వరింతము. రేపు తక్కన విషయములను ముచ్చటించు కొందము గాక! సెలవు
No comments:
Post a Comment