కవిసార్వ భౌముడు శ్రీనాధుఁడు
తేే: రంభ! రంభామ్ర ఫల సమగ్రంబుఁగాఁగ
నమృత దివ్యాన్న భిక్ష కామారి కొసఁగె,
రాపుఁ జన్నుల కెలను రారాజు పట్టి
పట్టి యెత్తిన నఖ రేఖ బయలు పడగ;
నమృత దివ్యాన్న భిక్ష కామారి కొసఁగె,
రాపుఁ జన్నుల కెలను రారాజు పట్టి
పట్టి యెత్తిన నఖ రేఖ బయలు పడగ;
అప్సరలలో నొకతెయగు రంభ రంభాఫలములను, మామిడి పండ్లను జోడించి దివ్యాన్న భిక్ష కామారికి యొసగినదట . ఆయొడ్డించుటలో బాహుమూలములనెత్తి యగపడ జేయుచు నలకూబరుడొనర్చిన నఖక్షతముల నెత్తిచూపుచున్నదట! యిదిభవుని రెచ్చ గొట్టుటేగదా!
అసలు దేవలోకమున నుండదగిన యప్సరో భామినులకిట నేమిపని? వారీ దారుకా వనమున నివసింప కారణ మేమి? యనుప్రశ్న మనలోకొందరికి ఇప్పటికే గల్గియండవచ్చును. వినుడు. దారుకావనము హిమగిరి కంథరములకు సమీపమునగల యతిసుందరమైన వనము; సర్వకాలములయందును యటవసంతమే! నవ పుష్ప ఫల విరాజితమై నందనవనమును పోలియుండును. తత్కారణమున సప్తఋషులు దీనిని తపోవన భూమిగాఁజేసికొన్నారు. దేవేంద్రునకుృ వారినిజూచిన భయము. వారిదుర్భర తపంబున తనదేవేంద్రపాలన కెట్టిముప్పు గలుగకుండ యెప్పటి కప్పుడు వారితపోభంగ మొనరించుటకు రంభాద్యప్సరో భామినులకు ఒకవాడ నేర్పరచి యందుండ నియమించెను. వఅదికారణముగా వారిచ్చటనివసంచుచున్నారు.
దారుకావనము హిమవంతునిరాజధాని ఓషధప్రస్థమునకు నాతిదూరము. మామపైనలిగిన భవుఁడు పరివారముతో దారుకావనము నేతెంచినాడు. యధేచ్చా విహారములతో తృతీయ పురుషార్ధమునకు వన్నెలుదిద్దుకొను చున్నాడు.
ఉ: పెట్టెఁ దిలోత్తమాప్సరస భిక్ష ప్రియంబున భూతభర్తకున్
గట్టుఁబసిండి పాత్ర బులకండముతోడ ,ఘృతంబుతోడఁగ్రొం
బట్టుఁ బసిండి సిబ్బెములఁ బయ్యెద కొం గొక కొంతజారి చ
న్కట్టు లలాట లోచనుని కన్నులు మూటికి విందు సేయగన్;
గట్టుఁబసిండి పాత్ర బులకండముతోడ ,ఘృతంబుతోడఁగ్రొం
బట్టుఁ బసిండి సిబ్బెములఁ బయ్యెద కొం గొక కొంతజారి చ
న్కట్టు లలాట లోచనుని కన్నులు మూటికి విందు సేయగన్;
ఇకతిలోత్తమ పసిడి పాత్రలో పులకండములు, ఘృతములను గలిపిదెచ్చి వడ్డించింది, యెలా?తానుగట్టిన క్రొత్త పట్టుచీరె కొంగొకింతజారగా నామెచనుకట్టుఅందమంతయు నాతని మూడు నేత్రములకు విందు చేయునట్లు భిక్షను వడ్డిచినది. నొత్తముమీద అప్సరల భిక్ష యైనది. ముందుకు నడచినాడు. సప్తఋషులయావాసములు కనులఁబడినవి. వారియాడువారు త్రిలోక మోహనులై యున్నారు
మ: దరహాసంబుల భ్రూలతా నటన ముద్రా విభ్రమ ప్రౌఢిమన్,
బరి హాసోక్తుల భావ గర్భ రస సంపల్లంపటాలోకన
స్ఫురణా భంగుల మౌని కాంతల మనంబుల్ చూరలాడెన్ మహే
శ్వరుఁడు ద్దామ విలాసి దారు వనికా వాటప్రదేశంబులన్ ;
బరి హాసోక్తుల భావ గర్భ రస సంపల్లంపటాలోకన
స్ఫురణా భంగుల మౌని కాంతల మనంబుల్ చూరలాడెన్ మహే
శ్వరుఁడు ద్దామ విలాసి దారు వనికా వాటప్రదేశంబులన్ ;
కొందరినిఁజూచినవ్వుతున్నాడట! మరికొందరికి కనబొమల నాడిస్తో యేవోసంకేతాలుఁ బంపుతున్నాడట! కొందరితో వేళాకోళాలాడుతున్నాడట! మరికొందరినురససూచకంగా చూపులునిగిడి స్తున్నాడట! ఈవిధంగామునికాంతల మనస్సులను శివుడు కొల్లగొట్చాడట! అమాయకులైనయాఋషిపత్నులెల్లరాశంకరుని మాటలకు లోగి గిరి గహ్వరముల నతనితో నెధేఛ్ఛావిహారమొనరింప సాగిరి. సప్తఋషు లీయకృత్యమునకు గినికి యొక్కుమ్మడిగా బట్ట నుంకింప బట్టువడక, మహాలింగోధ్భవమును ప్రదర్శించినాడు . పాతాళమునుండి యాకాశమువరకు పరివ్యాప్తమై, నయాలింగాకారమును గాంచి వారద్భుతమునంది చేతులు జోడించినారు.
అల్లుని యాగడములనువిని మామ హిమవంతుఁడరుదెంచి మంచిమాటలతో నింటికి గొనిపోయెను. శివపార్వతుల సంసారము నిలఁ బడినది. శివుడు కాలకంఠుఁడుగదా ! ఆవిషయమునే పార్వతి యడుగ దానికి సమాధానముగా క్షీరసాగర మథన కధను శివుఁడు పార్వతికిృవినిపించెను. జగన్మోహిని యమృత వితరణము తో నీ రెండవ విలాసము పరిసమాప్త మగు చున్నది.
ఇక మూడవ విలాసము అర్జునుని పాశుపత సంసిధ్ధి. కాలకేయాది రాక్షసగణం దేవతలను బాధించు చుండగా అర్జునుఁడు పాశుపతం తో వారిని యుధ్ధంలో సంహరిస్తాడు. దేవతలకు మహోపకారం చేస్తీడు. ఆసందర్భంగానే వలచివచ్చిన తనను కాదనుటచే రంభ అర్జనునకు శాపమీయటం మొన్నగు విషయాలు యిందు ప్రసక్తమైనాయి. హిమగిరిపై అర్జునునిఃమహోగ్రతపంబు, మాయాశాంబర వేషధారియై శంకరుఁడు కిరీటిని పరీక్షింప నెంచటం, వారినడుమయుధ్ధం , చివరకు పాశుపత ప్రాప్తి, రాక్షస సంహారాది విశేషాలతోనీ మూడవవిలాసం వీర రస సమున్మేషమై ముగిసినది.
ఇట్లు కరుణ, శృంగార, వీర రసోచితములై, పరమేశ్వర లీలా విహార విలాస విజల్పితములై, శ్రీనాధుని ప్రౌఢ కవితాచాతుర్యమునకు నిదర్శనములై , హరవిలాసము ఒప్పారు చున్నది;
నేటికింటితో మనప్రసంగమును ముగింతము . రేపు తక్కిన విషయముల ముచ్చటించుకొందము,. సెలవు!
నేటికింటితో మనప్రసంగమును ముగింతము . రేపు తక్కిన విషయముల ముచ్చటించుకొందము,. సెలవు!
No comments:
Post a Comment