కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
హరవిలాస రచనము
సీ: కలిత శుండాదండ గండూషి తోన్ముక్త
సప్త సాగర మహా జలభరములు ;
సప్త సాగర మహా జలభరములు ;
వప్రక్రియాకేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీ ధర రత్న మేఖ లములు;
మేదినీ ధర రత్న మేఖ లములు;
పక్వ జంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్కదంబకములు;
చుంబిత భూభృత్కదంబకములు;
వికట కండూల గండక దేహమండలి
ఘట్టిత బ్రహ్మాండ కర్ప రములు ;
ఘట్టిత బ్రహ్మాండ కర్ప రములు ;
తే: శాంభవీ శంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోప శాంతి గావించుగాక!
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోప శాంతి గావించుగాక!
హరవిలాసము- అవతారిక- 5వ పద్యము.
కవి సార్వ భౌముఁడు కాశీఖండము ననూదిత మొనర్చి వీరభద్రారెడ్డి కంకిత మొనర్చెనను వార్త దేశ దేశములందు విస్త రించెను. అంత నాతని చిన్ననాటి యనుంగు మిత్రుడు సింహవిక్రమ పురి( ఇప్పటి నెల్లూరు) నివాసి, యవచి తిప్పయ సెట్టి శ్రీనాధుని తమ పట్టణమున కాహ్వానించెను. మిత్రుని యాహ్వనమందుకొన్న శ్రీనాధుఁడించుక యోచించి పాకనాటికి ముఖ్య పట్టణ మైవిరాజిల్లు సింహ విక్రమ పురికి బోవుట కుత్సహించెను. యెంతయైనను మాతృభూమియెడల గల మ మకారమును జూపనివారెవ్వరుందురు? తన చిన్న నాటి నేస్తులను వారి యాప్యాయతలను మదిలోనెంచి , ఆహాకాలమెంత విచిత్రమైనది? యెక్కడి పాకనాడు? యెక్కడి గోదావరీ తీరము? రెడ్డిరాజుల యాశ్రయము లభించుటంజేసి నాజీవన విధానమంతయు మారినదిగదా! నన్నింత వాని నొనరించిన వేమారెడ్జి ప్రభువర్యునకు సదాకృతజ్ఙతాంజలులు. మాతృ భూమిని పై దిదృక్ష నన్నుక్కిరి బిక్కిరి చేయుచున్నది. కాన నొక్కమారు పాకనాటి కేగి మనసార నాప్రాంతములను దర్శించి మగిఁడి వచ్చెదనుగాక! యని నిశ్ఛయంచు కొని వీరభద్రారెడ్డి యానతిచే సింహవిక్రమ పురికి పయనమాయెను.
కతిపయ పరివారముతో శిష్య సముదాయముతో మహదట్టహాసముగా నరుదెంచిన కవిసార్వభౌముని సగౌరవముగా స్వాగతించి తిప్పయ సెట్టి యోగ క్షేమములను విచారించి " మిత్రమా! మీయభ్యుదయమునకు నేనెంతయో సంతోషమున నుప్పొంగి పోవుచుంటిని. వ్యాపారార్ధినై కొమర గిరి రెడ్డి కడకు వచ్చినపుడు తాము రాచకార్య నిమగ్నులయి యుంట విశ్రాంతిగా మాటలాడు నవకాశము లభింపదయ్యెను. నేటికిగదా నాయదృష్టము పండినది . కవిసార్వ భౌమా ! నావిన్నపమును మన్నింపుము;
తే: ఆగమ జ్ఙాన నిధివి తత్త్వార్ధ నిధివి
బహు పురాణజ్ఙుఁడవు, శుభ భవ్య మతివి,
బాలసఖుఁడవు, శైవ ప్రబంధ మొకటి
యవధరిపుము , నాపేర నంకితముగ.
బహు పురాణజ్ఙుఁడవు, శుభ భవ్య మతివి,
బాలసఖుఁడవు, శైవ ప్రబంధ మొకటి
యవధరిపుము , నాపేర నంకితముగ.
యని సవినయముగ నభియర్ధించెను. "కస్తూరీ కర్పూర చందన తాబూలమును , జాంబూనదాంబరాది వస్త్రాలంకారాదులను నతనికి సమర్పించెను. శ్రీనాధుఁడా మిత్రుని కృతిపతిగా గారవింప నెంచెను. " మిత్రమా నీకోర్కెఫలించునుగాక! నాసర్వేశ్వరానుగ్రహమున ' హర విలాస' మనెడి దివ్యమైన శైవ మహాగ్రంధము నొకదానిని నీపేర వెలయింతును గాక!" యనిపలికి ,కృతిపతికి యాశీస్సులనందించు కావ్య మంగళాశాసనమును యిట్లని యాశువుగా పలికెను.
ఉ:- శ్రీ మహీళా పయోధర హరి న్మణిహారము , హస్తి భూధర
స్వామి, పయోజ సంభవుని జన్నముఁగాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచిశ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
ధీమణి మండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్ధుఁ జేయుతన్; -
స్వామి, పయోజ సంభవుని జన్నముఁగాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచిశ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
ధీమణి మండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్ధుఁ జేయుతన్; -
అని శుభాశంసనమ్ములం బలికి హరవిలాస రచనమును ప్రారంభించెను. రచన సాగుచునే యున్నది. ఇంతకు నీయవచి తిప్పయ శ్రేష్ఠి చేయువ్యాపారమేమి? రారాజులతో నీతనికి గలసంబంధమేమి యనువిషయములను యించుక బరిశీలింతము. తిప్పయ సెట్టి నెల్లూరు, కాంచీ పట్టణములయందు సుగంధ ద్రవ్యముల నమ్ము బేహారి. కస్తూరీ జవ్వాది చందనము అగరు సాంబ్రాణి పచ్చకప్పురము యాలకులు లవంగములు మొన్నగు సుగింధ వస్తు వ్యాపారములో దిట్ట.
మ: తరుణా సీరి తవాయి గోవ రమణా స్ధానంబులం జందనా
గరు కర్పూర హిమాంబు కుంకుమ రజః కస్తూరికా ద్రవ్యముల్ ,
శరధిన్ కప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్య కులోత్తముం డవచి తిప్పం డల్పుఁడే యమ్మహిన్;
గరు కర్పూర హిమాంబు కుంకుమ రజః కస్తూరికా ద్రవ్యముల్ ,
శరధిన్ కప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్య కులోత్తముం డవచి తిప్పం డల్పుఁడే యమ్మహిన్;
తరుెణా, చైనా, సింహళము, హవాయి,గోవా, సుమిత్రా , జావా, మున్నగు దేశములనుండి , కస్తారీ, జవ్వాది, కుంకుమపూవు , మున్నగు సుగంధ ద్రవ్యములను , సముద్రమార్గము ద్వారా," కప్పలి- జోగు- లని పేరొందిన నౌకలలో దెప్పించి రారాజులకు సరఫరాయొనర్తెడువాఁడట! వసంత రాయఁడనిపేరొందిన కుమార గిరి రెడ్డికి వసంతోత్సవ నిర్వహణమునకు టన్నుల కొద్దిగా కస్తూర్యాది సుగంధ వస్తువులను సప్లయి చేసెడు వాడట! మన రాజులకేగాక, ఢిల్లీసుల్తాను వారికి, ఫిరోజ్ ఖాన్ గాపేరొందిన గల్బర్గా సుల్తాను వారికి, హరిహరరాయల వారికి నితని సుగంధ వస్తువులు అందించు చుండెడి వాడని హరవిలాస యవరారికా పద్యములు నిరూపించు చున్నవి.
మ: ఖుసిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో , నీకరా
భ్యసన ప్రౌఢి నుతించురా యవచి తిప్పా! చంద్ర సారంగ నా
భి సముద్పాదిత తాళవృంత పవన ప్రేంఖోల్లన ప్రక్రియా
వసరోదంచిత సార సౌరభ రస వ్యాలోల రోలంబముల్;
భ్యసన ప్రౌఢి నుతించురా యవచి తిప్పా! చంద్ర సారంగ నా
భి సముద్పాదిత తాళవృంత పవన ప్రేంఖోల్లన ప్రక్రియా
వసరోదంచిత సార సౌరభ రస వ్యాలోల రోలంబముల్;
భావము:- సుల్తాన్ వారు సంతోషంగా కొలువుఁ దీరియుండగా పరిచారికలు తాళవృంతములకు తిప్పయ సెట్టియంపిన కస్తూరిని పూసి గాలివీతురట! అపుడా సువాసనలకు సుల్తాను మైమరచు చుండగా నాసుగంధమునకు సమాకర్షింపఁబడిన తుమ్మెదల దండులా సభాభవనము చుట్టును తిరుగుచుండు దృశ్యమును గాంచి సుల్తానువారు మేలైన సుగంధ ద్రవ్యముల నేరిపంపు నీచేతి గొప్పదనమును ప్ర శంసించు చుందురు లేవయ్యా! యనియీపద్య భావము. ఆవెనువెంటనే హరిహరరాయలు, ఫిరోజ్ ఖాన్ వంటి మహారాజుల ప్రశంసలు యీగ్రంధమున వర్ణింపఁబడినవి. ఇంతటితో నేటికి చాలింతము రేపు హరవిలాసములోని విలాసములను కులాసాగా విని మురియుదము, సెలవు.
No comments:
Post a Comment