కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
సీ: ఆంధ్ర క్ష మా మండ లాఖండలుండైన
వేమ భూపతి కృపావీక్షణంబు;
ఘోడె రాయాంక! సద్గురు రాజ భీమేశ్వ
రస్వామి పద సమారాధనంబు;
రస్వామి పద సమారాధనంబు;
కమలాద్రి నిలయ నార్కండేయ శివమౌళి
చంద్రాంశు నవసుధా సార ధార;
చంద్రాంశు నవసుధా సార ధార;
వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ
కల్హార మాలికా గంధ లహరి;
కల్హార మాలికా గంధ లహరి;
తే: కారణంబులు నుద్బోధ కములు గాగ,
సంభ వించిన సాహిత్య సౌష్ఠ వమున ,
వీరభద్రేశ్వరుఁ బ్రబంధ విభునిఁ జేసి ,
కాశికాఖండముఁ దెనుంగుఁ గానొనర్తు;
సంభ వించిన సాహిత్య సౌష్ఠ వమున ,
వీరభద్రేశ్వరుఁ బ్రబంధ విభునిఁ జేసి ,
కాశికాఖండముఁ దెనుంగుఁ గానొనర్తు;
కాశీఖండము- అవ- 16 పద్యం ;
భావము;- శ్రీమదాంధ్ర మహాసామ్రాజ్య మునకు యేలిక యైన వేమారెడ్డి కరుణా కటాక్షములును, ఘోడెరాయఁడను బిరుఁదొందిన సద్గురు రాయఁడగు భీమేశ్వరస్వామి పదసమారాధనమును, కమలాద్రి నిలయుఁడగు మార్కండేశ్వర స్వామి జటాజూటమునందలి చంద్రుని తొలివెన్నెలధారలు, వేదాద్రిలో వెలసిన శ్రీ నృసింహ స్వామి మెడలో నలంకరించిన చెంగల్వల దండలోని సువాసనలు కారణములై నాకవితకు పేరరణములైయొప్ప నొదవిన సాహిత్య పుష్ఠిచే వీరభద్రారెడ్డిని కృతిపతి గానొనర్చి కాశికాఖండమును దెనిగింతును. అని భావము. యిందు తన ప్రసిధ్ధికి ప్రత్యక్షముగాను, పరోక్షముగాను దోడ్పడిన వేమారెడ్డిని సంభావించెను. తనకు శివాగమ దీక్షనోసంగిన గురువు వీరభద్ర స్వామికి యంజలి ఘటించెను. మార్కండేయీశ్వరుని, వేదాద్రి నరసింహ స్వామిని ప్రస్తుతించెను .
వేమారెడ్డి కోరికయు తనకార్యమునకు (అనగా కాశీఖండ కావ్యరచనమునకు) అనుకూలముగానుండుటచే కవిసార్వ భౌమున కమితానందము ఘటిల్లెను.
తే: కలిగెఁ బదియారు వన్నె బంగారమునకుఁ
బద్మ రాగంబు తోడి సంపర్క లభ్ధి
కాశికాఖండమను మహాగ్రంధమునకు
నాయకుఁడు వీరభద్ర భూనాధుఁ డగుట!
బద్మ రాగంబు తోడి సంపర్క లభ్ధి
కాశికాఖండమను మహాగ్రంధమునకు
నాయకుఁడు వీరభద్ర భూనాధుఁ డగుట!
కవితనయామోదమును దెలుప రాజు కర్పూర తాంబూల సహిత జాంబూ నదాంబరాది కానుక లొసంగి యతనిని బహు ఘనముఁగా సత్క రించినాడు." ప్రభూ తమ యాజ్ఙమేరకు నేటినుండి కావ్య దీెక్షా తత్పరుండనై యనతి కాలములోనే కావ్యమును సంపూర్ణమొనరించి కావ్యాంకిత సభకరుదెమతునుగాక! యనుజ్ఙ వేడెదనని యనుమతినొంది శ్రీనాధుఁడు విడిదికిఁబోయెను.
చ: స్కంద పురాణ సంహితకు ఖండము లేబది;యమదులోన నా
నంద వనానుభావ కధనంబున శ్రోతకు వక్తకున్ శుభా
నంద పరంపరావహము నైజగుణంబగు; కాశిఖండ మా
కందువెఱింగి నేను సమకట్టితి కావ్యముగా నొనర్ప గాన్;
కాశీఖం-అవ- 8 పద్యం
నంద వనానుభావ కధనంబున శ్రోతకు వక్తకున్ శుభా
నంద పరంపరావహము నైజగుణంబగు; కాశిఖండ మా
కందువెఱింగి నేను సమకట్టితి కావ్యముగా నొనర్ప గాన్;
కాశీఖం-అవ- 8 పద్యం
ఇది స్కాంద పురాణ కధ. స్కాందపురాణ మన్నిపురాణముల కన్నను మిగుల పెద్దది. మనకు లోకప్రసిధ్ధమగు శ్రీరమాసహిత సత్య నారాయణ వ్రత కధయు నందు చెప్పబడినదియే! " ఇతి స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కధాయాం ప్రథమాధ్యాయః సమాప్తః" అనివింటూ వుంటాము. అదిరేవాఖండమునందలిది. యీపురాణమునకు 50 ఖండములుండును . అందు కాశీఖండమొకటి . ఇందు కాశీక్షేత్ర మాహాత్మ్యము తోబాటు యనేక కధలుగలవు.
కాశీఖండము లోని ముఖ్యకధ పరమేశ్వరాగ్రహమునకు లోనై వ్యాసుఁడు కాశిని వీడవలసి వచ్చుట. దీనికి దోడుగా అగస్త్యుఁడు లోకోప రారమునుగోరి లోపాముద్ర తోగూడి కాశినివీడి దక్షిణ కాశిగా ప్రసిధ్ధినొందిన దక్షారామ క్షేత్రమున నివసించుట . వ్యాసుఁడుఁడును సశిష్యముఁగా నటకుయేతెంచుట.ఒకరి కష్టములొకరెరింగి ఉభయు లూరడిలి యాక్షేత్రమునందునివసించుట మొన్నగు విషయములతో గూడియుండును. ఈరెండు గాధలేగాక శివపారమ్యములగు అనేక కధలిందు సందర్భానుకూలముగా వివరింపఁ బడినవి.
కాశీఖండమున క్షేత్ర మహిమయే చెప్పబడినను, అందందు , సాముద్రిక, పాతంజల యోగశాస్త్ర , మంత్రశాస్త్ర విషయములను పొందుపరుపఁబడినవి. ఇట్లీగ్రంధము శ్రీనాధుని ప్రౌఢ కవితాశైలికి మాత్రమేగాక, పాండితీ ప్రతిభకుఁగూడ నికషోపలముగా నొప్పారు చున్నది.
పరమ మాహేశ్వర దీక్షాలోలుడై శ్రీనాధ కవి బహు సమర్ధత తోనీకావ్యమును రచియించెను. పలుకు నుడికారమునగాని కవితాశైలిలో గాని యెక్కడను యతనిప్రౌఢత యించుకంత యేనియు తగ్గక పండితజనైకవేద్యమై " కాశీఖండ మయః పిండమ్" ( కాశీఖండమా? అది యుక్కు గుండువంటిది. ) యను పండితోక్తికి భాజనమై నేటికీ ఆంధ్ర సారస్వతమున నొక విశిష్ఠస్ధానమునకు తావలమై యొప్పారు చున్నది.
శ్రీనాధుఁడీ గ్రంధమును కతిపయ దినములలో పూర్తి యొనరించి వీరభద్రారెడ్డికి యంకితమొనరించి, తనప్రభుభక్తి పరాయణతను వెల్లడించుకొని కృత కృత్యత నొందెను. శ్రీనాధుని జీవన ప్రస్థానము ముగిసిన వెనుక నతని గ్రంధములను విపులముగా విశ్లేషించు తలంపుగలదు గాన నితకు మిక్కిలి దీనిని గురించి నుడువక ముందు కేగుదముగాక! యిప్పట్టున వీరభద్రారెడ్డి కాలమున బ్రాహ్మణుల జీవన మెంత వైభవోపేతముగా నుండెడిదో వివరించు నీసీస పద్యము నుదాహరించు చున్నాడను;
శ్రీనాధుఁడీ గ్రంధమును కతిపయ దినములలో పూర్తి యొనరించి వీరభద్రారెడ్డికి యంకితమొనరించి, తనప్రభుభక్తి పరాయణతను వెల్లడించుకొని కృత కృత్యత నొందెను. శ్రీనాధుని జీవన ప్రస్థానము ముగిసిన వెనుక నతని గ్రంధములను విపులముగా విశ్లేషించు తలంపుగలదు గాన నితకు మిక్కిలి దీనిని గురించి నుడువక ముందు కేగుదముగాక! యిప్పట్టున వీరభద్రారెడ్డి కాలమున బ్రాహ్మణుల జీవన మెంత వైభవోపేతముగా నుండెడిదో వివరించు నీసీస పద్యము నుదాహరించు చున్నాడను;
సీ: ధరియింప నేర్చిరి దర్భ వెట్టిన వ్రేళ్ళ
లీల మాణిక్యాంగు ళీయకములు;
లీల మాణిక్యాంగు ళీయకములు;
కల్పింప నేర్చిరి గంగ మట్టియ మీద
కస్తూరికా పుండ్రకంబు నొసల;
కస్తూరికా పుండ్రకంబు నొసల;
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల
తార హారములు ముత్యాల సరులు;
తార హారములు ముత్యాల సరులు;
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుములఁ
గమ్మని క్రొత్త చెంగల్వ విరులు;
గమ్మని క్రొత్త చెంగల్వ విరులు;
తే: ధామముల వెండి పసిడియుఁ దడబడంగ
బ్రాహ్మణోత్తము లగ్ర హారముల యందు
వేమ భూపాలు ననుజన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటము లందు;
బ్రాహ్మణోత్తము లగ్ర హారముల యందు
వేమ భూపాలు ననుజన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటము లందు;
కాశీఖండము- అవ- 37 వ పద్యం
ఇంతటితో శ్రీనాధ కవీంద్రుని కాశీఖండ రచనము గూడ ముగిసినది . నేచికింతటితో మన ప్రసంగమును ముగింతము. రేపు తక్కిన విషయములను ముచ్చటింతముగాక! సెలవు!
No comments:
Post a Comment