కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు
సీ: సింహాసనము చారు సితపుండరీకంబు ,,
చెలికత్తెఁ జెలువారు పలుకుఁజిలుక;
చెలికత్తెఁ జెలువారు పలుకుఁజిలుక;
శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు ,
పసిఁడి కిన్నెర వీణ పలుకుఁ దోడు ,
పసిఁడి కిన్నెర వీణ పలుకుఁ దోడు ,
నలువ నెమ్మోముఁ దమ్ములు కేళి గృహములు ,
తళుకు టద్దంబు సత్కవుల మనసు;
తళుకు టద్దంబు సత్కవుల మనసు;
వేదాది విద్యలు విహరణ స్ధలములు,
చక్కని రాయంచ యెక్కిరింత ;
చక్కని రాయంచ యెక్కిరింత ;
తే: యెపుడు నేదేవి, కాదేవి యిందు, కుంద,
చంద్ర , చందన, మందార, సార వర్ణ
శారదాదేవి! మామక స్వాంత వీధి
నిండువేడుక విహరించు చుండుఁ గాక!
చంద్ర , చందన, మందార, సార వర్ణ
శారదాదేవి! మామక స్వాంత వీధి
నిండువేడుక విహరించు చుండుఁ గాక!
శృంగార నైషధము - ప్ర- ఆ: 5ప;
భావము:- సితపుండరీకమే సిహాసనము గా విరాజిల్లునదియు, కమ్మని మాటలఁబలుకు చిలుక నెచ్చెలి యైనదియు, చందమామ యే అలంకరణ పుష్ప మైనదియు, బంగరు కిన్నెర వీణయే సంగీత సాధనమైనదియు, నలువ( బ్రహ్మ- నాలుఁగు మొగములవాఁడు) మోముదామరలే పడకటిళ్ళుగా నొప్పు నట్టిదియు, సత్కవుల మనస్సే తళుకు టద్దముగా నెంచెడిదియు, వేదము మున్నగు విద్యలే విహార ్ధలములుగా గలదియు, చక్కని రాజహంస వాహనముగా నొప్పునదియు, నయి, యేదేవి విరాజిల్లునో , "చంద్రునివలెను, మొల్లపూవువలెను, మంచిగంధమువలెను, మందారమువలెను, తెల్లని వర్ణమున ప్రకాశించుచుండునో యట్టి యాశారదాదేవి , నాహృదంతరమందు సదా పరిపూర్ణమైన ఆనందముతో విహరించు చుండు గాక! " చదువులతల్లి, నలువరాణి , వేదస్వరూపిణి, యైన సరస్వతీ మాతను వర్ణించు పట్ల శ్రీనాధునిలో నొక వైయక్తికత , విలక్షణత, మనకు గనిపించును. యాజగదేక మాతను స్వరూప స్వభావ సహితముగా మహోదార వైభవ సహితగా వర్ణించును. ఈపద్యము నందలి యెత్తుగీతిని బరిశీలింపుడు. "ఇందుకుందమొదలు - సారవర్ణ" వరకు. తదివినారుగదా! మీకేమనిదోచుచున్నది? పోతనగారి "శారద నీరదేందు" పద్యము గుర్తుకు వచ్చుటలేదా? అందొకరూపవర్ణనమేగలదు; దానికీపద్యము దారిజూప నోపిన నోపవచ్చునేమో? అస్తు! ప్రస్తుతము ననుసృరింతము.
శ్రీనాధుఁడు కొండవీటిలో లేనికాలమున నారాజ్యముపయి కుకవుల దాడి యెక్కుడైనది. దానికికారణమారెడ్డిరాజుల యౌదార్యమేననుట నిస్సంశయము. రెడ్డి రాజులు తక్కిన రాజుల వంటివారు గారు మిక్కిలి ధర్మపరాయణులు. తాముప్రభువులరైనను , అట్లు భావించక తాము ప్రజలకు ప్రతినిధులమని భావించుచుడెడివారు. ప్రజావిత్తమునకు, ధర్మపరిరక్షణకుమాత్రమే తమయధికారమును వినియోగించెడివారు. వారు సాహిత్యప్రియులు , వేదసంస్కృతియెడల యారాధనాభావముఁగలవారు. అందుచేతనే వారిరాజ్యమున వేదవిప్రులకు, పండితులకు, కవులకు, ఘనసన్మానములు జరుఁగు చుండెడివి. తరచుగా యోగ్యులకు దేవాలయములకు అగ్రహారము లొసంగబడుచుండెడివి. ఆయధికారము విద్యాధికారిది. విద్యాధికారియామోదమునందిన తరువాతనే యతనికి రాజదర్శన భాగ్యము. అటుపిమ్మటనే సత్కారము. ఇదీయచటి పధ్ధతి. శ్రీనాధుఁడింత దనుక విజయ యాత్ర కేగినాడుగదా! యిక మిడతల దమడువలె కొండవీటిపై కుకవుల దాడి ప్రారంభమైనది. యవీధిలోజూచినా వారే ! చివరకిది ప్రభువులకుఁ దలనొప్పిగాఁబరిణమించినది. శ్రీనాధుఁడు వచ్చిన వెంటనే యిది గమనించినాఁడు . అతనికి వారినిజూడవెగటు బుట్టినది . చివరకు- " భోజనం దేహి రాజేంద్ర " వంటి వారందరూ మహాకవులమని చాటుకొను చుండ వారిని వెక్కిరించుచు, శ్రీనాధుఁడు-
ఉ: బూడిద బుంగవై యొడలు పోడిమిఁప్పి మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొ చోయనన్
గోడల గొందులం దొదిగిఁ గూయుచు నుందువు కొండవీటిలో
గాడిద! నీవునుం గవివి గావు గదా? యనుమాన మయ్యడిన్;
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొ చోయనన్
గోడల గొందులం దొదిగిఁ గూయుచు నుందువు కొండవీటిలో
గాడిద! నీవునుం గవివి గావు గదా? యనుమాన మయ్యడిన్;
యనివారిపై యప్రతిహతమగు తనచాటుపద్య బాణమును ప్రయోగించినాడు. శ్రీనాధుని రాకతో కుకవులకు ప్రాణము పోయినట్లయినది. యెక్కడి వారక్కడగా చెల్లాచెదరైనారు. కవిసార్వభౌముని సారధ్యమున తిరిగి విద్యాకార్యక్రమము లారంభమయినవి. యోగ్యులైన కవిపండితులకు తగిన సత్కారములు జరుపబడు చున్నవి. తక్కినవారు కేవల సంభావన మాత్రమున సంతుష్ఠులయి వెనుఁదిరుగు చుండెడి వారు. ప్రభువర్యుని చిత్తమునకు వూరట లభిచినది. కవిసార్వభౌముఁడు ప్రతిదినమును పండితులతో గలసి శాస్త్ర చర్చల తోను , యెడనెడ విశ్రాంత సమయమున ప్రభువునకు పురాణాదికములను వినిపించుటతోను, చక్కని సంస్కృత గ్రంధములను జదివిచెప్పుట తోను, వినోదమును గల్పించు చుండెను.
కతిపయ దినము లిట్లు గ్రమియంప శ్రీనాధునకు రాజమహేంద్ర వరముృపై మనసు మరలెను. ఒకానొక శుభముహూర్తమున వేమారెడ్డికడ రాజమహేంద్ర వరమునకేగ యనుమతిని గోరెను. పండిత పక్షపాతియు, నాశ్రిత కవిజన ప్రియుఁడు నగు వేమారెడ్డి సబహుమానముగా రాజమహేంద్రి కేగుటకు శ్రీనాధున కనుమతియొసంగెను. ప్రయాణమునకు వలయు నేర్పాటు గావించి ముందుగా శ్రీనాధుని రాకను రాజమహేంద్రవర పాలకుఁడగు వీర భద్రారెడ్డికి వర్తమాన మంపెను. శ్రీనాధు డంత నొకశుభ దినమున సపరివారుఁడై రాజమహేంద్ర వరమునకు పయన మయ్యెను .
No comments:
Post a Comment